ETV Bharat / city

కరోనాపై ప్రైవేటు ఆసుపత్రుల కాసులవేట... రూ.లక్షల్లో బిల్లులు

author img

By

Published : Aug 7, 2020, 10:31 AM IST

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు అమలు కావడం లేదు. రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. బీమా ఉన్నా నగదు చెల్లిస్తేనే చికిత్స అందిస్తున్నాయి. ప్రశ్నించిన వారిపై సిబ్బంది దాడులకు దిగుతున్నారు. 2 రోజుల్లోనే 200 ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇటీవలే రెండు కార్పొరేట్‌ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది. అయినా తీరు మార్చుకోవడం లేదు.

private-hospitals-continue-to-charge-in-excess-for-covid-treatment-in-Hyderabad
private-hospitals-continue-to-charge-in-excess-for-covid-treatment-in-Hyderabad

ఒక ప్రైవేటు సంస్థ ఉద్యోగి (51) చాన్నాళ్లుగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. సమస్య కాస్త ఎక్కువకావడంతో వారం క్రితం తెలంగాణలోని హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. రూ.3 లక్షలకు బీమా ఉందని చెప్పగా, అది చెల్లుబాటు కాదని, నగదు చెల్లిస్తేనే చేర్చుకుంటామని ఆసుపత్రి వర్గాలు తేల్చిచెప్పాయి. కరోనా అనుమానంతో చికిత్స మొదలెట్టిన వైద్యులు, ఐసీయూలో ఉంచి ఆక్సిజన్‌ అందించారు. రోజుకు రూ.85 వేలు బిల్లు వేశారు. పరీక్షల్లో కొవిడ్‌ నెగిటివ్‌ అని తేలడం, ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం ఆయన్ను సాధారణ వార్డులోకి మార్చారు. ‘‘ఆరు రోజుల చికిత్సకు రూ.3 లక్షలు కట్టించుకుని, ఇకపై రోజుకు రూ.60 వేలు కట్టాలన్నారు. చెల్లించిన సొమ్ముకు రశీదు అడిగినా ఇవ్వలేదు. తెలిసిన వారి ద్వారా చెప్పిస్తే మొత్తం బిల్లులో 30 శాతానికి రశీదు ఇవ్వడానికి అంగీకరించారు’’ అని బాధితుడు వాపోయారు.

‘బిల్లు ఎంత వేస్తే అంతా కట్టాల్సిందే. రశీదు మాత్రం మేమిచ్చిందే తీసుకోవాలి’. కొవిడ్‌ కష్టకాలంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు అనుసరిస్తున్న తీరిది. అడ్డగోలుగా బిల్లులు వసూలు చేయడమే కాకుండా, చెల్లించిన సొమ్ముకు కాగిత రూపంలో ఆధారాలు ఇవ్వకుండా బాధిత కుటుంబాలను కొన్ని ‘కాసుపత్రులు’ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే ఆసుపత్రి సిబ్బంది భౌతిక దాడులకు దిగుతున్నారు. అడ్డగోలు బిల్లులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం, సర్కారు చర్యలకు ఉపక్రమిస్తుండటంతో కొన్ని ప్రైవేటు దవాఖానాలు ఈ కొత్త దందాకు తెరతీశాయి. ఇలాంటి పోకడలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా లెక్కచేయడం లేదు.

  • 2 రోజుల్లోనే 200 ఫిర్యాదులు

మంగళ, బుధవారాల్లోనే అధిక బిల్లుల వసూలు, ఎక్కువ సొమ్ము తీసుకుని, తక్కువ మొత్తానికి రసీదులు ఇవ్వడం వంటి ఉదంతాలపై 200కి పైగా ఫిర్యాదులు రావడం ఇందుకు నిదర్శనమే. ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లుల దందాపై ఫిర్యాదు చేయాలంటూ ప్రభుత్వం ‘91541 70960’ వాట్సప్‌ నంబరు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి గత 20 రోజుల్లోనే సుమారు 2 వేలకుపైగా ఫిర్యాదులు అందడం గమనార్హం.

ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యారోగ్యశాఖకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..

  • దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి(55) కొండాపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యుణ్ని సంప్రదించాడు. కరోనా లక్షణాలున్నాయనే సందేహముందని, ఆసుపత్రిలో చేరాలని వైద్యుడు సలహా ఇచ్చాడు. ఓపీలో స్వాబ్‌ తీసుకోవాల్సిందిగా కోరగా, ఆసుపత్రిలో చేరితేనే స్వీకరిస్తామనే నిబంధన విధించారు. ఆసుపత్రిలో విడి గదిలో పడక కేటాయించి, దగ్గు, జ్వరం మందులు వాడారు. మూడురోజుల తర్వాత ‘కొవిడ్‌ నెగెటివ్‌’గా తేలిందని చెప్పి రూ.లక్ష బిల్లు వేశారు.
  • కొవిడ్‌ లక్షణాలతో సోమాజిగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వ్యక్తి నుంచి నమూనాలు స్వీకరించారు. వారం గడిచినా ఫలితాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు చికిత్స కొనసాగిస్తూ రోజుకు రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు.
  • ఏ రోగానికి చికిత్స అందిస్తున్నారనే స్పష్టత కూడా ఇవ్వడం లేదంటూ కుటుంబ సభ్యులు తాజాగా ఫిర్యాదు ఇచ్చారు.
  • వైరస్‌ సోకిన మహిళ సికింద్రాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరగా, నాలుగు రోజుల్లోనే రూ.2 లక్షలు వసూలు చేశారు.
  • కరోనా అనుమానంతో మాదాపూర్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరిన వ్యక్తి నాలుగు రోజుల చికిత్స అనంతరం చనిపోయాడు. రూ.3.5 లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లమని ఆసుపత్రి వర్గాలు ఒత్తిడి చేశాయి.
  • బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో కరోనా బాధితునికి నాలుగు రోజులు చికిత్స చేసి రూ.4.5 లక్షలు వసూలు చేశారు. రశీదు ఇవ్వలేదు.
  • కొవిడ్‌ సోకిన వ్యక్తి బంజారాహిల్స్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఐదు రోజులు చికిత్స పొందాడు. ప్రైవేటు బీమా ఉన్నా చేరినప్పుడే బయానాగా రూ.50 వేలు కట్టించుకుని, రూ.3.85 లక్షల బిల్లు వేశారు.
  • హైటెక్‌ సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నాలుగు రోజుల ఫ్లూ చికిత్సకు రూ.2.93 లక్షలు బిల్లు వేశారు. ఇదేమని నిలదీస్తే రూ.93వేలు తగ్గించారని బాధితురాలు ఫిర్యాదు చేశారు.

సర్కారు ధరలు తూచ్‌

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు రోజుకు ఐసోలేషన్‌లో రూ.4 వేలు, ఐసీయూలో రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ చికిత్సకు రూ.9 వేల చొప్పున వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అవి ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం ఇటీవలే రెండు కార్పొరేట్‌ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది. మంత్రి ఈటల రాజేందర్‌ వాటి తీరుపై మంగళవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. మరింత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినా దవాఖానాల తీరు మారలేదు.

రూ.7 లక్షలు వసూలు.. రూ.2.20 లక్షలకు రసీదు

రూ.10 లక్షల ప్రైవేటు బీమా ఉంది. కరోనాగా నిర్ధారణ కావడంతో ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిని ఆశ్రయించా. నగదు చెల్లిస్తేనే చేర్చుకుంటామని ఆసుపత్రి సిబ్బంది తేల్చిచెప్పడంతో మరో గత్యంతర లేక రూ.లక్ష చెల్లించి చేరిపోయా. 8 రోజుల చికిత్స అనంతరం రూ.7 లక్షలు కట్టాలన్నారు. ఆ సొమ్మూ చెల్లించా. రశీదు మాత్రం రూ.2.20 లక్షలకే ఇచ్చారు. ‘చెల్లించిన మొత్తానికి బిల్లులిస్తే బీమా సంస్థకు దరఖాస్తు చేసుకుని, ఆ సొమ్ము రాబట్టుకుంటానని ఆసుపత్రి వర్గాలను కోరినా ఫలితం లేకపోయింది’ అని బాధిత యువకుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు.

రూ.6.18 లక్షల బిల్లులో.. పీపీఈ కిట్లకే రూ.3.5 లక్షలయిందట

అత్త, మామలకు ఫ్లూ లక్షణాలు కనిపించడంతో కాచిగూడలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించా. కొవిడ్‌ పరీక్షల్లో ఇద్దరికీ నెగిటివ్‌ అని తేలింది. రెండుమూడు రోజుల చికిత్సకుగానూ ఒకరికి రూ.4.76 లక్షలు, ఇంకొకరికి రూ.1.42 లక్షలు బిల్లు వేశారు. మొత్తం బిల్లులో పీపీఈ కిట్లకే రూ.3.5 లక్షలు ఖర్చయినట్టు చూపారు. అత్తమ్మ బిల్లు(రూ.1.42 లక్షలు) మొత్తాన్ని ప్రైవేటు బీమా సంస్థ నుంచి స్వీకరించారు. మిగిలిన రూ.4.76 లక్షలు నగదుగా చెల్లించా. సదరు సొమ్ము తాలూకూ రశీదు ఇవ్వమంటే ఆసుపత్రి వర్గాలు నిరాకరించడంతోపాటు భౌతిక దాడికి దిగాయి. మరో బాధితుని ఆవేదన.

నిర్ధారణ పరీక్షల్లోనూ అడ్డుగోలు వసూళ్లే

అత్యధిక కార్పొరేట్‌ ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షల పేరిటా అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఒక్కో నమూనా సేకరణకు రూ.4-5 వేలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలకూ రుసుములు ఖరారు చేసింది. ప్రైవేటులో రూ.2,200, ఇంటికొచ్చి నమూనా స్వీకరిస్తే రూ.2,800గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అధిక శాతం ల్యాబ్‌లలో పీపీఈ కిట్‌, మాస్కులు, ఇతరత్రా వ్యక్తిగత వస్తువులన్నింటి ధరలనూ కలిపి మరీ వసూలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో చేరితేనే నమూనా స్వీకరిస్తామనే నిబంధనను కొన్ని దవాఖానాలు అమలుచేస్తున్నాయి. ఫలితాలు వచ్చేవరకు రోగిని ఐసొలేషన్‌లో ఉంచి రూ.2 లక్షలకు పైగా వసూలు చేసిన ఉదంతాలూ ఉన్నాయి. మరికొన్ని ఆన్‌లైన్‌ ఓపీ సంప్రదింపులు, హోం ఐసొలేషన్‌ సేవలతో ముడిపెడుతూ నిర్ధారణ పరీక్షకు రూ.13-20 వేల వరకూ ధరలు ఖరారు చేశాయి. ఇంకొన్ని ల్యాబ్‌లలో సీటీ స్కాన్‌ ధరలను అమాంతంగా పెంచేశారు. సాధారణంగా ఛాతీ సీటీస్కాన్‌కు రూ.2000-2500 మధ్య వసూలు చేస్తారు. కొవిడ్‌ నేపథ్యంలో గిరాకీ పెరగడంతో ఏకంగా రూ.5-6 వేలు రాబడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి.

ఇదీ చూడండి

'సృష్టి' కేసు.. బిడ్డ చనిపోయిందని నమ్మించి అమ్మేశారు: సీపీ ఆర్కే మీనా

ఒక ప్రైవేటు సంస్థ ఉద్యోగి (51) చాన్నాళ్లుగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. సమస్య కాస్త ఎక్కువకావడంతో వారం క్రితం తెలంగాణలోని హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. రూ.3 లక్షలకు బీమా ఉందని చెప్పగా, అది చెల్లుబాటు కాదని, నగదు చెల్లిస్తేనే చేర్చుకుంటామని ఆసుపత్రి వర్గాలు తేల్చిచెప్పాయి. కరోనా అనుమానంతో చికిత్స మొదలెట్టిన వైద్యులు, ఐసీయూలో ఉంచి ఆక్సిజన్‌ అందించారు. రోజుకు రూ.85 వేలు బిల్లు వేశారు. పరీక్షల్లో కొవిడ్‌ నెగిటివ్‌ అని తేలడం, ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం ఆయన్ను సాధారణ వార్డులోకి మార్చారు. ‘‘ఆరు రోజుల చికిత్సకు రూ.3 లక్షలు కట్టించుకుని, ఇకపై రోజుకు రూ.60 వేలు కట్టాలన్నారు. చెల్లించిన సొమ్ముకు రశీదు అడిగినా ఇవ్వలేదు. తెలిసిన వారి ద్వారా చెప్పిస్తే మొత్తం బిల్లులో 30 శాతానికి రశీదు ఇవ్వడానికి అంగీకరించారు’’ అని బాధితుడు వాపోయారు.

‘బిల్లు ఎంత వేస్తే అంతా కట్టాల్సిందే. రశీదు మాత్రం మేమిచ్చిందే తీసుకోవాలి’. కొవిడ్‌ కష్టకాలంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు అనుసరిస్తున్న తీరిది. అడ్డగోలుగా బిల్లులు వసూలు చేయడమే కాకుండా, చెల్లించిన సొమ్ముకు కాగిత రూపంలో ఆధారాలు ఇవ్వకుండా బాధిత కుటుంబాలను కొన్ని ‘కాసుపత్రులు’ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే ఆసుపత్రి సిబ్బంది భౌతిక దాడులకు దిగుతున్నారు. అడ్డగోలు బిల్లులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం, సర్కారు చర్యలకు ఉపక్రమిస్తుండటంతో కొన్ని ప్రైవేటు దవాఖానాలు ఈ కొత్త దందాకు తెరతీశాయి. ఇలాంటి పోకడలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా లెక్కచేయడం లేదు.

  • 2 రోజుల్లోనే 200 ఫిర్యాదులు

మంగళ, బుధవారాల్లోనే అధిక బిల్లుల వసూలు, ఎక్కువ సొమ్ము తీసుకుని, తక్కువ మొత్తానికి రసీదులు ఇవ్వడం వంటి ఉదంతాలపై 200కి పైగా ఫిర్యాదులు రావడం ఇందుకు నిదర్శనమే. ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లుల దందాపై ఫిర్యాదు చేయాలంటూ ప్రభుత్వం ‘91541 70960’ వాట్సప్‌ నంబరు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి గత 20 రోజుల్లోనే సుమారు 2 వేలకుపైగా ఫిర్యాదులు అందడం గమనార్హం.

ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యారోగ్యశాఖకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..

  • దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి(55) కొండాపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యుణ్ని సంప్రదించాడు. కరోనా లక్షణాలున్నాయనే సందేహముందని, ఆసుపత్రిలో చేరాలని వైద్యుడు సలహా ఇచ్చాడు. ఓపీలో స్వాబ్‌ తీసుకోవాల్సిందిగా కోరగా, ఆసుపత్రిలో చేరితేనే స్వీకరిస్తామనే నిబంధన విధించారు. ఆసుపత్రిలో విడి గదిలో పడక కేటాయించి, దగ్గు, జ్వరం మందులు వాడారు. మూడురోజుల తర్వాత ‘కొవిడ్‌ నెగెటివ్‌’గా తేలిందని చెప్పి రూ.లక్ష బిల్లు వేశారు.
  • కొవిడ్‌ లక్షణాలతో సోమాజిగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వ్యక్తి నుంచి నమూనాలు స్వీకరించారు. వారం గడిచినా ఫలితాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు చికిత్స కొనసాగిస్తూ రోజుకు రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు.
  • ఏ రోగానికి చికిత్స అందిస్తున్నారనే స్పష్టత కూడా ఇవ్వడం లేదంటూ కుటుంబ సభ్యులు తాజాగా ఫిర్యాదు ఇచ్చారు.
  • వైరస్‌ సోకిన మహిళ సికింద్రాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరగా, నాలుగు రోజుల్లోనే రూ.2 లక్షలు వసూలు చేశారు.
  • కరోనా అనుమానంతో మాదాపూర్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరిన వ్యక్తి నాలుగు రోజుల చికిత్స అనంతరం చనిపోయాడు. రూ.3.5 లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లమని ఆసుపత్రి వర్గాలు ఒత్తిడి చేశాయి.
  • బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో కరోనా బాధితునికి నాలుగు రోజులు చికిత్స చేసి రూ.4.5 లక్షలు వసూలు చేశారు. రశీదు ఇవ్వలేదు.
  • కొవిడ్‌ సోకిన వ్యక్తి బంజారాహిల్స్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఐదు రోజులు చికిత్స పొందాడు. ప్రైవేటు బీమా ఉన్నా చేరినప్పుడే బయానాగా రూ.50 వేలు కట్టించుకుని, రూ.3.85 లక్షల బిల్లు వేశారు.
  • హైటెక్‌ సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నాలుగు రోజుల ఫ్లూ చికిత్సకు రూ.2.93 లక్షలు బిల్లు వేశారు. ఇదేమని నిలదీస్తే రూ.93వేలు తగ్గించారని బాధితురాలు ఫిర్యాదు చేశారు.

సర్కారు ధరలు తూచ్‌

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు రోజుకు ఐసోలేషన్‌లో రూ.4 వేలు, ఐసీయూలో రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ చికిత్సకు రూ.9 వేల చొప్పున వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అవి ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం ఇటీవలే రెండు కార్పొరేట్‌ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది. మంత్రి ఈటల రాజేందర్‌ వాటి తీరుపై మంగళవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. మరింత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినా దవాఖానాల తీరు మారలేదు.

రూ.7 లక్షలు వసూలు.. రూ.2.20 లక్షలకు రసీదు

రూ.10 లక్షల ప్రైవేటు బీమా ఉంది. కరోనాగా నిర్ధారణ కావడంతో ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిని ఆశ్రయించా. నగదు చెల్లిస్తేనే చేర్చుకుంటామని ఆసుపత్రి సిబ్బంది తేల్చిచెప్పడంతో మరో గత్యంతర లేక రూ.లక్ష చెల్లించి చేరిపోయా. 8 రోజుల చికిత్స అనంతరం రూ.7 లక్షలు కట్టాలన్నారు. ఆ సొమ్మూ చెల్లించా. రశీదు మాత్రం రూ.2.20 లక్షలకే ఇచ్చారు. ‘చెల్లించిన మొత్తానికి బిల్లులిస్తే బీమా సంస్థకు దరఖాస్తు చేసుకుని, ఆ సొమ్ము రాబట్టుకుంటానని ఆసుపత్రి వర్గాలను కోరినా ఫలితం లేకపోయింది’ అని బాధిత యువకుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు.

రూ.6.18 లక్షల బిల్లులో.. పీపీఈ కిట్లకే రూ.3.5 లక్షలయిందట

అత్త, మామలకు ఫ్లూ లక్షణాలు కనిపించడంతో కాచిగూడలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించా. కొవిడ్‌ పరీక్షల్లో ఇద్దరికీ నెగిటివ్‌ అని తేలింది. రెండుమూడు రోజుల చికిత్సకుగానూ ఒకరికి రూ.4.76 లక్షలు, ఇంకొకరికి రూ.1.42 లక్షలు బిల్లు వేశారు. మొత్తం బిల్లులో పీపీఈ కిట్లకే రూ.3.5 లక్షలు ఖర్చయినట్టు చూపారు. అత్తమ్మ బిల్లు(రూ.1.42 లక్షలు) మొత్తాన్ని ప్రైవేటు బీమా సంస్థ నుంచి స్వీకరించారు. మిగిలిన రూ.4.76 లక్షలు నగదుగా చెల్లించా. సదరు సొమ్ము తాలూకూ రశీదు ఇవ్వమంటే ఆసుపత్రి వర్గాలు నిరాకరించడంతోపాటు భౌతిక దాడికి దిగాయి. మరో బాధితుని ఆవేదన.

నిర్ధారణ పరీక్షల్లోనూ అడ్డుగోలు వసూళ్లే

అత్యధిక కార్పొరేట్‌ ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షల పేరిటా అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఒక్కో నమూనా సేకరణకు రూ.4-5 వేలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలకూ రుసుములు ఖరారు చేసింది. ప్రైవేటులో రూ.2,200, ఇంటికొచ్చి నమూనా స్వీకరిస్తే రూ.2,800గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అధిక శాతం ల్యాబ్‌లలో పీపీఈ కిట్‌, మాస్కులు, ఇతరత్రా వ్యక్తిగత వస్తువులన్నింటి ధరలనూ కలిపి మరీ వసూలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో చేరితేనే నమూనా స్వీకరిస్తామనే నిబంధనను కొన్ని దవాఖానాలు అమలుచేస్తున్నాయి. ఫలితాలు వచ్చేవరకు రోగిని ఐసొలేషన్‌లో ఉంచి రూ.2 లక్షలకు పైగా వసూలు చేసిన ఉదంతాలూ ఉన్నాయి. మరికొన్ని ఆన్‌లైన్‌ ఓపీ సంప్రదింపులు, హోం ఐసొలేషన్‌ సేవలతో ముడిపెడుతూ నిర్ధారణ పరీక్షకు రూ.13-20 వేల వరకూ ధరలు ఖరారు చేశాయి. ఇంకొన్ని ల్యాబ్‌లలో సీటీ స్కాన్‌ ధరలను అమాంతంగా పెంచేశారు. సాధారణంగా ఛాతీ సీటీస్కాన్‌కు రూ.2000-2500 మధ్య వసూలు చేస్తారు. కొవిడ్‌ నేపథ్యంలో గిరాకీ పెరగడంతో ఏకంగా రూ.5-6 వేలు రాబడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి.

ఇదీ చూడండి

'సృష్టి' కేసు.. బిడ్డ చనిపోయిందని నమ్మించి అమ్మేశారు: సీపీ ఆర్కే మీనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.