ETV Bharat / city

పెట్రోల్, డీజిల్​పై వ్యాట్​ పెంచిన రాష్ట ప్రభుత్వం.. ఎంతంటే?

author img

By

Published : Jul 20, 2020, 6:51 PM IST

Updated : Jul 20, 2020, 7:46 PM IST

petrol and disel rates hike in andhra pradesh
petrol and disel rates hike in andhra pradesh

18:50 July 20

పెట్రోల్‌, డీజిల్ ధరలపై వ్యాట్‌ సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.1.24, డీజిల్‌పై 93 పైసలు వ్యాట్‌ పెంచింది.

పెట్రోల్​పై రూ. 1.24, డీజిల్​పై రూ.0.93 చొప్పున పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వ్యాట్ చట్టం 2005ను సవరించింది. పెట్రోలుపై 31 శాతం పన్నుతోపాటు 4 రూపాయలు అదనంగా సుంకం విధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. డీజిల్​పై 22.25 శాతం వ్యాట్​తో పాటు 4 రూపాయలు అదనంగా సుంకం విధించినట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కోవిడ్ కారణంగా రావాల్సిన ఆదాయం పడిపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా కారణంగా 4480 కోట్ల మేర రావాల్సిన రెవెన్యూ ప్రస్తుతం 1323 కోట్లు మాత్రమే వచ్చిందని ఈ కారణంగా పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులపై వ్యాట్ సవరించిక తప్పని పరిస్థితి నెలకొన్నట్టు ప్రభుత్వం వివరించింది.  ఏపీ కంటే పొరుగు రాష్ట్రాల్లో ఈ వ్యాట్ అధికంగా ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత పెంపుదల 2015-18 సంవత్సరాల మధ్య వసూలు చేసిన ప్రకారమే ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.  

ఇదీ చదవండి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్

18:50 July 20

పెట్రోల్‌, డీజిల్ ధరలపై వ్యాట్‌ సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.1.24, డీజిల్‌పై 93 పైసలు వ్యాట్‌ పెంచింది.

పెట్రోల్​పై రూ. 1.24, డీజిల్​పై రూ.0.93 చొప్పున పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వ్యాట్ చట్టం 2005ను సవరించింది. పెట్రోలుపై 31 శాతం పన్నుతోపాటు 4 రూపాయలు అదనంగా సుంకం విధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. డీజిల్​పై 22.25 శాతం వ్యాట్​తో పాటు 4 రూపాయలు అదనంగా సుంకం విధించినట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కోవిడ్ కారణంగా రావాల్సిన ఆదాయం పడిపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా కారణంగా 4480 కోట్ల మేర రావాల్సిన రెవెన్యూ ప్రస్తుతం 1323 కోట్లు మాత్రమే వచ్చిందని ఈ కారణంగా పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులపై వ్యాట్ సవరించిక తప్పని పరిస్థితి నెలకొన్నట్టు ప్రభుత్వం వివరించింది.  ఏపీ కంటే పొరుగు రాష్ట్రాల్లో ఈ వ్యాట్ అధికంగా ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత పెంపుదల 2015-18 సంవత్సరాల మధ్య వసూలు చేసిన ప్రకారమే ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.  

ఇదీ చదవండి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్

Last Updated : Jul 20, 2020, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.