ETV Bharat / city

ఎన్​కౌంటర్​ గురించి అనుమానాలున్నాయా...?

author img

By

Published : Dec 9, 2019, 8:02 AM IST

న్యాయ విచారణ జరగకుండానే దిశ కేసులో నిందితులను ఎన్​కౌంటర్ చేయడం న్యాయమా అంటూ నిందితుల కుటుంబ సభ్యులు ఎన్​హెచ్​ఆర్​సీ ముందు వాపోయారు. ఆదివారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిజనిర్ధారణ బృందం విచారణకు నిందితుల కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. నిందితుల ప్రవర్తన, విద్య, కుటుంబ పరిస్థితులను ఎన్​హెచ్​ఆర్​సీ సభ్యులు ఆరా తీశారు. కేసు విచారణలో పోలీసులు ఎలా వ్యవహరించారు?... ఎన్​కౌంటర్ సమాచారాన్ని ముందే చెప్పారా?... నిందితులతో కుటుంబ సభ్యులను మాట్లాడనిచ్చారా?... అంటూ ప్రశ్నలడిగి సమాధానాలు తెలుసుకున్నారు.

nhrc-enquiry-on-encounter-of-disha-murder-accused
nhrc-enquiry-on-encounter-of-disha-murder-accused

దిశ హత్య కేసులో నిందితుల ఎన్​కౌంటర్​పై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్... నిందితుల కుటుంబ సభ్యులను కూడా విచారించింది. రెండో రోజు సీనియర్‌ ఎస్పీ మన్‌జీత్‌ సైనీతో కూడిన ఏడుగురు సభ్యుల బృందం నిందితుల కుటుంబసభ్యుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ విచారణకు దిశ హత్య కేసు ప్రధాన నిందితుడు ఆరీఫ్ తండ్రి హుస్సేన్, జొల్లు శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కురుమయ్య, నవీన్ తల్లి లక్ష్మీ హాజరయ్యారు. ఎన్‌కౌంటర్‌ గురించి అనుమానాలున్నాయా, నిందితుల కుటుంబాల ఆర్థిక పరిస్థితి, కుటుంబసభ్యులు ఏం చేస్తుంటారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుల వ్యక్తిగత వివరాలను కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం వారి కుటుంబాలకు జీవనాధారమేమిటనే కోణంలోనూ పలు అంశాలు తెలుసుకున్నారు.

ఎన్​కౌంటర్​ గురించి అనుమానాలున్నాయా...?

దిశ తండ్రి, సోదరిని ప్రశ్నించిన ఎన్​హెచ్​ఆర్​సీ...

మరో వైపు దిశ తండ్రి, సోదరిని కూడా ఎన్‌హెచ్‌ఆర్​సీ బృందం ప్రశ్నించింది. ఎన్‌కౌంటర్‌ గురించి ముందే తెలుసా, అసలు ఏం జరిగింది, మీకేమైనా సమస్యలున్నాయా, అంటూ గంట సేపు పాటు వారిని ప్రశ్నించి సమాచారం సేకరించారు. ఎన్‌కౌంటర్‌ గురించి టీవీల్లో చూసిన తర్వాతే తమకు తెలిసిందని, పోలీసుల నుంచి దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని వారు కమిషన్‌ సభ్యులకు వివరించారు.

రిమాండ్​లో ఉండగానే ఎన్ కౌంటర్ చేసి చంపడం న్యాయమా..?

ఎన్​హెచ్​ఆర్​సీ బృందం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన నిందితుల కుటుంబ సభ్యులు ఎన్​కౌంటర్​పై తమ వాదనలు కూడా వినిపించారు. తమ బిడ్డలు చేసింది క్షమించరాని నేరమే అయినా... న్యాయ విచారణ జరగకుండానే, రిమాండ్​లో ఉండగానే ఎన్ కౌంటర్ చేసి చంపడం న్యాయమా?... అని ఎన్​హెచ్​ఆర్​సీ సభ్యుల ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు . కనీసం చివరిచూపునకు నోచుకోకుండా... అరెస్టు చేసినప్పటి నుంచి మాట కూడా మాట్లాడనివ్వకుండా చివరికి ప్రాణాలు తీసేసారని కమిషన్ ముందు వాపోయారు. ఎన్​కౌంటర్ జరిగిన తీరుపైనా కుటుంబ సభ్యులు సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వపరంగా న్యాయం జరిగేలా చూడాలి...

నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక ప్రస్తుతం నిండు గర్భిణి. తల్లిదండ్రులు లేని అనాథ. ఉన్న భర్తను కూడా ఎన్​కౌంటర్​లో కోల్పోయింది. ప్రస్తుతం ఆమె భవిష్యత్తు ఏమిటని.. చెన్నకేశవులు తండ్రి కురుమయ్య కమిషన్ సభ్యులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అత్తామామలమైనా తామూ నిరుపేదలమని ఒక్కగానొక్క కుమారున్ని కోల్పోయినట్లు వివరించారు. నిందితుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూడాలని కమిషన్​ను వేడుకున్నారు. మరోనిందితుడైనా నవీన్ తల్లి లక్ష్మీ కూడా తన కుటుంబ పరిస్థితిని కమిషన్ కు వివరించారు.

నేడు పోలీసులకు ప్రశ్నలు...

ఇవాళ జాతీయ మానవహక్కుల కమిషన్‌ పోలీసులను ప్రశ్నించే అవకాశముంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చింది? ఎదురు కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు ఆ సమయంలో నిందితులకు అక్కడికి ఎందుకు తీసుకువెళ్లారు, మీ చేతుల్లోంచి నిందితులు తుపాకులు ఎలా లాక్కున్నారు, మీ పై దాడి చేశారా అని నిందితుల వెంట ఉన్న పోలీసుల నుంచి వివరాలు సేకరించే అవకాశముంది.

హైకోర్టు తీర్పు వచ్చాకే అంత్యక్రియలు

ఎన్​హెచ్​ఆర్​సీ విచారణ కోసం ఆదివారం తెల్లవారుజామునే కుటుంబ సభ్యులను హైదరాబాద్​కు తీసుకు వెళ్లారు. అందరినీ కలిపి కాకుండా ఒక్కో కుటుంబం నుంచి ఒక్కొక్కరిని వేర్వేరుగా సభ్యులు విచారించారు. విచారణ పూర్తైన అనంతరం రాత్రి 7 గంటల తర్వాత పోలీసులు వారిని వారి స్వగ్రామాల్లో విడిచి వెళ్లారు. ఇవాళ చటాన్​పల్లిలో దిశ హత్య నిందితుల ఎన్​కౌంటర్​పై దాఖలైన పిల్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఆదేశాల మేరకే నిందితుల మృతదేహాలను పోలీసులు భద్రపరిచి ఉంచారు. వాటిని కుటుంబ సభ్యులకు ఎప్పుడు అప్పగిస్తారన్నది ఇవాళ్టి విచారణ అనంతరం తేలనుంది.

ఇవీ చూడండి: తను కన్నవారికీ... తనను కన్నవారికీ... తనే అమ్మ!

దిశ హత్య కేసులో నిందితుల ఎన్​కౌంటర్​పై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్... నిందితుల కుటుంబ సభ్యులను కూడా విచారించింది. రెండో రోజు సీనియర్‌ ఎస్పీ మన్‌జీత్‌ సైనీతో కూడిన ఏడుగురు సభ్యుల బృందం నిందితుల కుటుంబసభ్యుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ విచారణకు దిశ హత్య కేసు ప్రధాన నిందితుడు ఆరీఫ్ తండ్రి హుస్సేన్, జొల్లు శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కురుమయ్య, నవీన్ తల్లి లక్ష్మీ హాజరయ్యారు. ఎన్‌కౌంటర్‌ గురించి అనుమానాలున్నాయా, నిందితుల కుటుంబాల ఆర్థిక పరిస్థితి, కుటుంబసభ్యులు ఏం చేస్తుంటారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుల వ్యక్తిగత వివరాలను కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం వారి కుటుంబాలకు జీవనాధారమేమిటనే కోణంలోనూ పలు అంశాలు తెలుసుకున్నారు.

ఎన్​కౌంటర్​ గురించి అనుమానాలున్నాయా...?

దిశ తండ్రి, సోదరిని ప్రశ్నించిన ఎన్​హెచ్​ఆర్​సీ...

మరో వైపు దిశ తండ్రి, సోదరిని కూడా ఎన్‌హెచ్‌ఆర్​సీ బృందం ప్రశ్నించింది. ఎన్‌కౌంటర్‌ గురించి ముందే తెలుసా, అసలు ఏం జరిగింది, మీకేమైనా సమస్యలున్నాయా, అంటూ గంట సేపు పాటు వారిని ప్రశ్నించి సమాచారం సేకరించారు. ఎన్‌కౌంటర్‌ గురించి టీవీల్లో చూసిన తర్వాతే తమకు తెలిసిందని, పోలీసుల నుంచి దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని వారు కమిషన్‌ సభ్యులకు వివరించారు.

రిమాండ్​లో ఉండగానే ఎన్ కౌంటర్ చేసి చంపడం న్యాయమా..?

ఎన్​హెచ్​ఆర్​సీ బృందం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన నిందితుల కుటుంబ సభ్యులు ఎన్​కౌంటర్​పై తమ వాదనలు కూడా వినిపించారు. తమ బిడ్డలు చేసింది క్షమించరాని నేరమే అయినా... న్యాయ విచారణ జరగకుండానే, రిమాండ్​లో ఉండగానే ఎన్ కౌంటర్ చేసి చంపడం న్యాయమా?... అని ఎన్​హెచ్​ఆర్​సీ సభ్యుల ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు . కనీసం చివరిచూపునకు నోచుకోకుండా... అరెస్టు చేసినప్పటి నుంచి మాట కూడా మాట్లాడనివ్వకుండా చివరికి ప్రాణాలు తీసేసారని కమిషన్ ముందు వాపోయారు. ఎన్​కౌంటర్ జరిగిన తీరుపైనా కుటుంబ సభ్యులు సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వపరంగా న్యాయం జరిగేలా చూడాలి...

నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక ప్రస్తుతం నిండు గర్భిణి. తల్లిదండ్రులు లేని అనాథ. ఉన్న భర్తను కూడా ఎన్​కౌంటర్​లో కోల్పోయింది. ప్రస్తుతం ఆమె భవిష్యత్తు ఏమిటని.. చెన్నకేశవులు తండ్రి కురుమయ్య కమిషన్ సభ్యులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అత్తామామలమైనా తామూ నిరుపేదలమని ఒక్కగానొక్క కుమారున్ని కోల్పోయినట్లు వివరించారు. నిందితుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూడాలని కమిషన్​ను వేడుకున్నారు. మరోనిందితుడైనా నవీన్ తల్లి లక్ష్మీ కూడా తన కుటుంబ పరిస్థితిని కమిషన్ కు వివరించారు.

నేడు పోలీసులకు ప్రశ్నలు...

ఇవాళ జాతీయ మానవహక్కుల కమిషన్‌ పోలీసులను ప్రశ్నించే అవకాశముంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చింది? ఎదురు కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు ఆ సమయంలో నిందితులకు అక్కడికి ఎందుకు తీసుకువెళ్లారు, మీ చేతుల్లోంచి నిందితులు తుపాకులు ఎలా లాక్కున్నారు, మీ పై దాడి చేశారా అని నిందితుల వెంట ఉన్న పోలీసుల నుంచి వివరాలు సేకరించే అవకాశముంది.

హైకోర్టు తీర్పు వచ్చాకే అంత్యక్రియలు

ఎన్​హెచ్​ఆర్​సీ విచారణ కోసం ఆదివారం తెల్లవారుజామునే కుటుంబ సభ్యులను హైదరాబాద్​కు తీసుకు వెళ్లారు. అందరినీ కలిపి కాకుండా ఒక్కో కుటుంబం నుంచి ఒక్కొక్కరిని వేర్వేరుగా సభ్యులు విచారించారు. విచారణ పూర్తైన అనంతరం రాత్రి 7 గంటల తర్వాత పోలీసులు వారిని వారి స్వగ్రామాల్లో విడిచి వెళ్లారు. ఇవాళ చటాన్​పల్లిలో దిశ హత్య నిందితుల ఎన్​కౌంటర్​పై దాఖలైన పిల్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఆదేశాల మేరకే నిందితుల మృతదేహాలను పోలీసులు భద్రపరిచి ఉంచారు. వాటిని కుటుంబ సభ్యులకు ఎప్పుడు అప్పగిస్తారన్నది ఇవాళ్టి విచారణ అనంతరం తేలనుంది.

ఇవీ చూడండి: తను కన్నవారికీ... తనను కన్నవారికీ... తనే అమ్మ!

Intro:Tg_mbnr_20_08NHRC_ENQUIRY_PKG_3068847


Body:....


Conclusion:బైట్స్ :
1)ప్రదాన నిందితుడు ఆరిఫ్ తండ్రి హుస్సేన్,
2) జోల్లు శివ తండ్రి జోల్లు రాజప్ప,
3)చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.