negligence on Buddhist: ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్న బౌద్ధ సంపద
By
Published : Sep 23, 2021, 7:55 AM IST
కృష్ణా జిల్లా ఘంటసాలలోని బౌద్ధ స్తూపం, బుద్ధుడి కాలం నాటి ఆనవాళ్లను చాటిచెప్పే శాసనాలు, శిల్పాలపై నిర్లక్ష్యపు(negligence on Buddhist stupa and the landmarks) నీడలు కమ్ముకున్నాయి. బౌద్ధ స్తూపం చుట్టూ వర్షపునీరు, చెరువుల నుంచి వచ్చే ఊట నీరు చేరి నిల్వ ఉంది. పాచి పట్టి అపరిశుభ్రంగా మారింది. పురావస్తుశాఖ మ్యూజియం ముందు అలనాటి శాసనాలు, శిల్పాలు ఆరేళ్లుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉన్నాయి. అధికారులు వీటిపై దృష్టి సారించి శాసనాలు, శిల్ప సంపదను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.