ETV Bharat / city

విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుంటే.. జగన్ కొంటున్నారు: లోకేశ్

author img

By

Published : Mar 9, 2021, 3:42 PM IST

విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుంటే జగన్ రెడ్డి కొంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి లేఖలతో జగన్ రెడ్డి కాలక్షేపం చేస్తున్నారని ఆక్షేపించారు. వైకాపా నాయకులు ఇకనైనా డ్రామాలు ఆపాలంటూ ట్వీట్ చేశారు.

విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుంటే.. జగన్ కొంటున్నారు: లోకేశ్
విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుంటే.. జగన్ కొంటున్నారు: లోకేశ్

ప్రజల హక్కులను కాపాడలేని ఎంపీలు ఎంతమంది ఉంటే ఏం లాభం అని.. నారా లోకేశ్ విమర్శించారు. విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్నీ చెప్పటంతోపాటు, జగన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసిందని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

జగన్ దిల్లీ పర్యటన కేసుల మాఫీ కోసమే: గోరంట్ల

జగన్ దిల్లీ పర్యటన కేసుల మాఫీ కోసమేనని అర్థమవుతోందని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. 'రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన పోలవరం పెండింగ్ బకాయిలపై ఎలాంటి వినతిపత్రం అందలేదని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కేంద్రాన్ని ప్రశ్నించామనేది సాక్షిలో తప్ప ఎక్కడా కనిపించదు. ఇంతకీ దిల్లీ వెళ్లేది దేనికో అర్థం కావట్లేదు." అని గోరంట్ల ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: స్టీల్​ ప్లాంట్​పై మరోసారి ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

ప్రజల హక్కులను కాపాడలేని ఎంపీలు ఎంతమంది ఉంటే ఏం లాభం అని.. నారా లోకేశ్ విమర్శించారు. విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్నీ చెప్పటంతోపాటు, జగన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసిందని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

జగన్ దిల్లీ పర్యటన కేసుల మాఫీ కోసమే: గోరంట్ల

జగన్ దిల్లీ పర్యటన కేసుల మాఫీ కోసమేనని అర్థమవుతోందని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. 'రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన పోలవరం పెండింగ్ బకాయిలపై ఎలాంటి వినతిపత్రం అందలేదని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కేంద్రాన్ని ప్రశ్నించామనేది సాక్షిలో తప్ప ఎక్కడా కనిపించదు. ఇంతకీ దిల్లీ వెళ్లేది దేనికో అర్థం కావట్లేదు." అని గోరంట్ల ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: స్టీల్​ ప్లాంట్​పై మరోసారి ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.