ETV Bharat / city

Botsa: పవన్ నిజం ఒప్పుకున్నారు కానీ.. ఆ విషయం చెప్పలేకపోయారు: మంత్రి బొత్స

author img

By

Published : Mar 15, 2022, 8:05 PM IST

తనకు రోడ్‌మ్యాప్‌, ఆలోచన, అవగాహన లేదని జనసేన అధినేత పవన్‌ నిజం ఒప్పుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. జనసేన ఆవర్భావ సభలో ఉపన్యాసం ఇచ్చిన పవన్.. ప్రజలకు పనికివచ్చే అంశం ఒక్కదానిపైనా మాట్లాడలేదన్నారు. వైకాపాను ఎందుకు గద్దె దించాలో పవన్ చెప్పలేకపోయారని అన్నారు.

పవన్ నిజం ఒప్పుకున్నారు కానీ.. ఆ విషయం చెప్పలేకపోయారు
పవన్ నిజం ఒప్పుకున్నారు కానీ.. ఆ విషయం చెప్పలేకపోయారు
పవన్ నిజం ఒప్పుకున్నారు కానీ.. ఆ విషయం చెప్పలేకపోయారు

ఈ రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తారో జనసేన అధినేత పవన్ చెప్పలేకపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏం చేస్తారో స్పష్టంగా చెబితే ప్రజలు జనసేన గురించి ఆలోచిస్తారన్నారు. సినిమా డైలాగులు వినేందుకు చాలా బాగుంటాయన్న ఆయన.. రౌడీలు, గూండాలు వంటి పదాలు సినిమాల్లో వాడితే మంచిదన్నారు. ఏ వైకాపా నాయకుడు రౌడీయిజం చేశారో చెప్పాలని పవన్​ను నిలదీశారు.

జనసేన ఆవిర్భావ సభలో ఉపన్యాసం ఇచ్చిన పవన్.. ప్రజలకు పనికివచ్చే అంశం ఒక్కదానిపైనా మాట్లాడలేదన్నారు. వైకాపాను ఎందుకు గద్దె దించాలో పవన్ చెప్పలేకపోయారని ఆక్షేపించారు. తనకు రోడ్‌మ్యాప్‌, ఆలోచన, అవగాహన లేదని.. పవన్‌ నిజం ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు.

"ఈ రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తారో పవన్ చెప్పలేకపోయారు ఏం చేస్తారో స్పష్టంగా చెబితే ప్రజలు జనసేన గురించి ఆలోచిస్తారు. సినిమా డైలాగులు వినేందుకు చాలా బాగుంటాయి. ప్రజలకు పనికివచ్చే అంశం ఒక్కటీ పవన్ ఉపన్యాసంలో లేదు. వైకాపాను ఎందుకు గద్దె దించాలో పవన్ చెప్పలేకపోయారు. ఏ వైకాపా నాయకుడు రౌడీయిజం చేశారో చెప్పాలి. రౌడీలు, గూండాలు.. పదాలు సినిమాల్లో బాగుంటాయి. తనకు రోడ్‌మ్యాప్‌, ఆలోచన, అవగాహన లేదని పవన్‌ నిజం చెప్పారు."- బొత్స సత్యనారాయణ, మంత్రి

ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువ

పవన్‌ కల్యాణ్‌కు ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. వైకాపా నేతలు ఎవరు గూండాగిరీ చేశారో చెప్పాలని.. ప్రశ్నించారు. భాజపాతో పొత్తు పెట్టుకుని..రాష్ట్రానికి ఏం సాధించావని మంత్రి అవంతి పవన్‌ను నిలదీశారు.

ఇదీ చదవండి : ఏపీ రాజధాని అమరావతే.. 2024లో ప్రజాప్రభుత్వం స్థాపిస్తాం: పవన్

పవన్ నిజం ఒప్పుకున్నారు కానీ.. ఆ విషయం చెప్పలేకపోయారు

ఈ రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తారో జనసేన అధినేత పవన్ చెప్పలేకపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏం చేస్తారో స్పష్టంగా చెబితే ప్రజలు జనసేన గురించి ఆలోచిస్తారన్నారు. సినిమా డైలాగులు వినేందుకు చాలా బాగుంటాయన్న ఆయన.. రౌడీలు, గూండాలు వంటి పదాలు సినిమాల్లో వాడితే మంచిదన్నారు. ఏ వైకాపా నాయకుడు రౌడీయిజం చేశారో చెప్పాలని పవన్​ను నిలదీశారు.

జనసేన ఆవిర్భావ సభలో ఉపన్యాసం ఇచ్చిన పవన్.. ప్రజలకు పనికివచ్చే అంశం ఒక్కదానిపైనా మాట్లాడలేదన్నారు. వైకాపాను ఎందుకు గద్దె దించాలో పవన్ చెప్పలేకపోయారని ఆక్షేపించారు. తనకు రోడ్‌మ్యాప్‌, ఆలోచన, అవగాహన లేదని.. పవన్‌ నిజం ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు.

"ఈ రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తారో పవన్ చెప్పలేకపోయారు ఏం చేస్తారో స్పష్టంగా చెబితే ప్రజలు జనసేన గురించి ఆలోచిస్తారు. సినిమా డైలాగులు వినేందుకు చాలా బాగుంటాయి. ప్రజలకు పనికివచ్చే అంశం ఒక్కటీ పవన్ ఉపన్యాసంలో లేదు. వైకాపాను ఎందుకు గద్దె దించాలో పవన్ చెప్పలేకపోయారు. ఏ వైకాపా నాయకుడు రౌడీయిజం చేశారో చెప్పాలి. రౌడీలు, గూండాలు.. పదాలు సినిమాల్లో బాగుంటాయి. తనకు రోడ్‌మ్యాప్‌, ఆలోచన, అవగాహన లేదని పవన్‌ నిజం చెప్పారు."- బొత్స సత్యనారాయణ, మంత్రి

ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువ

పవన్‌ కల్యాణ్‌కు ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. వైకాపా నేతలు ఎవరు గూండాగిరీ చేశారో చెప్పాలని.. ప్రశ్నించారు. భాజపాతో పొత్తు పెట్టుకుని..రాష్ట్రానికి ఏం సాధించావని మంత్రి అవంతి పవన్‌ను నిలదీశారు.

ఇదీ చదవండి : ఏపీ రాజధాని అమరావతే.. 2024లో ప్రజాప్రభుత్వం స్థాపిస్తాం: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.