ETV Bharat / city

Maha Shivaratri: ఇందకీల్రాదిపై ఘనంగా ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Feb 26, 2022, 5:32 PM IST

మహాశివరాత్రి ఉత్సవాలు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా మంగళస్నానాలు నిర్వహించి వధూవరులుగా అలంకరించారు.

ఇందకీల్రాదిపై ఘనంగా ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు
ఇందకీల్రాదిపై ఘనంగా ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు మంగళస్నానాలు నిర్వహించి వధూవరులుగా అలంకరించారు. అర్చకులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అంకురార్పణ, మండపారాధన, కలశస్థాపన, ధ్వజారోహన, అగ్రిప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

  • మార్చి 1న వేకుమజామున 5 నుంచి రాత్రి 8 గంటల వరకు మల్లేశ్వరస్వామికి అభిషేకాలు, రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు మహాన్యాసం, రాత్రి 10 నుంచి 12.30 గంటల వరకు లింగోద్భవ కాలాభిషేకం. అనంతరం మల్లేశ్వరస్వామి దివ్యలీలా కల్యాణోత్సవాన్ని భక్తుల సమక్షంలో నిర్వహించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు.
  • మార్చి రెండో తేదీ ఉదయం మల్లేశ్వరస్వామి ఆలయంలో సదస్యం, సాయంత్రం 4 గంటలకు ఉత్సవమూర్తులతో రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.
  • మార్చి 3న పూర్ణాహుతి, వసంతోత్సవం, దుర్గాఘాట్‌లో ధ్వజావరోహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
  • మార్చి 4, 5 తేదీల్లో స్వామి వారికి ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవా కార్యక్రమాలతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

ఇదీ చదవండి :
Sivarathri in Srisailam : శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు.. సమర్పించిన దేవస్థానాలు..

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు మంగళస్నానాలు నిర్వహించి వధూవరులుగా అలంకరించారు. అర్చకులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అంకురార్పణ, మండపారాధన, కలశస్థాపన, ధ్వజారోహన, అగ్రిప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

  • మార్చి 1న వేకుమజామున 5 నుంచి రాత్రి 8 గంటల వరకు మల్లేశ్వరస్వామికి అభిషేకాలు, రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు మహాన్యాసం, రాత్రి 10 నుంచి 12.30 గంటల వరకు లింగోద్భవ కాలాభిషేకం. అనంతరం మల్లేశ్వరస్వామి దివ్యలీలా కల్యాణోత్సవాన్ని భక్తుల సమక్షంలో నిర్వహించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు.
  • మార్చి రెండో తేదీ ఉదయం మల్లేశ్వరస్వామి ఆలయంలో సదస్యం, సాయంత్రం 4 గంటలకు ఉత్సవమూర్తులతో రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.
  • మార్చి 3న పూర్ణాహుతి, వసంతోత్సవం, దుర్గాఘాట్‌లో ధ్వజావరోహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
  • మార్చి 4, 5 తేదీల్లో స్వామి వారికి ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవా కార్యక్రమాలతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

ఇదీ చదవండి :
Sivarathri in Srisailam : శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు.. సమర్పించిన దేవస్థానాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.