ETV Bharat / city

ఏపీ ఈఎన్​సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ

author img

By

Published : May 19, 2020, 4:01 PM IST

Updated : May 19, 2020, 5:30 PM IST

krishna river board letter to ap engineering in chief
krishna river board letter to ap engineering in chief

15:58 May 19

ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ఆపాలని ఆదేశించింది. మే నెల వరకు చేసిన కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకున్నారని బోర్డు తెలిపింది.

కేటాయించిన దానికంటే ఎక్కువ జలాలను వాడుకున్నందున నాగార్జునసాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏపీకి సూచించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్​కు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం లేఖ రాశారు. సాగర్ కుడి కాలువ ద్వారా 158.255 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటికే 158.264 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు బోర్డు తెలిపింది. హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 47.173 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటివరకు 48.328 టీఎంసీలు వినియోగించినట్లు బోర్డు పేర్కొంది. 

ఇప్పటికే కేటాయింపులకు మించి జలాలను తీసుకున్నందున సాగర్ కుడికాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు సూచించింది. నీటి విడుదలకు సంబంధించి బోర్డు ఉత్తర్వులను విధిగా పాటించాలని కోరిన బోర్డు... ఫిర్యాదులకు అవకాశం ఇవ్వవద్దని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు వాడుకున్న జలాలు, అందుబాటులో ఉన్న నీటి వివరాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖలో వివరించింది. 

ఇదీ చదవండి: 'తెలంగాణ విభజన చట్టాన్ని అతిక్రమిస్తోంది'

15:58 May 19

ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ఆపాలని ఆదేశించింది. మే నెల వరకు చేసిన కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకున్నారని బోర్డు తెలిపింది.

కేటాయించిన దానికంటే ఎక్కువ జలాలను వాడుకున్నందున నాగార్జునసాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏపీకి సూచించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్​కు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం లేఖ రాశారు. సాగర్ కుడి కాలువ ద్వారా 158.255 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటికే 158.264 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు బోర్డు తెలిపింది. హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 47.173 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటివరకు 48.328 టీఎంసీలు వినియోగించినట్లు బోర్డు పేర్కొంది. 

ఇప్పటికే కేటాయింపులకు మించి జలాలను తీసుకున్నందున సాగర్ కుడికాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు సూచించింది. నీటి విడుదలకు సంబంధించి బోర్డు ఉత్తర్వులను విధిగా పాటించాలని కోరిన బోర్డు... ఫిర్యాదులకు అవకాశం ఇవ్వవద్దని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు వాడుకున్న జలాలు, అందుబాటులో ఉన్న నీటి వివరాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖలో వివరించింది. 

ఇదీ చదవండి: 'తెలంగాణ విభజన చట్టాన్ని అతిక్రమిస్తోంది'

Last Updated : May 19, 2020, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.