బ్లాక్ ఫంగస్ చికిత్సకు రోగి వద్ద నుంచి రూ. 22 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు రావటంపై.. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విజయవాడ జీజీహెచ్లో పని చేస్తున్న వైద్యురాలు వాణి ప్రియ ను జిల్లా జాయింట్ కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. మరో స్టాఫ్నర్స్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వైద్యురాలికి రావాల్సిన జీతం చెల్లింపులను నిలుపుదల చేసినట్లు ప్రకటించారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు జేసీ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. కమిటీ విచారణ చేసి నివేదిక ఇచ్చిన తర్వాత.. అందులోని వివరాల ఆధారంగా జీజీహెచ్ సూపరిటెండ్పై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశముందని తెలిపారు. వైద్యురాలిని కొవిడ్ చికిత్స నిమిత్తం ప్రత్యేక భర్తీ విధానంలో తీసుకున్నామన్నారు.
ఇదీ చదవండి: