ETV Bharat / city

'మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు చేయించాలి'

author img

By

Published : Feb 22, 2021, 7:05 AM IST

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ను జనసేన ప్రతినిధి పోతిన మహేశ్​ విమర్శించారు. విజయవాడలోని పంజా సెంటర్​లో ప్రచారాన్ని నిలిపివేసి.. తాడేపల్లి కేంద్ర కార్యాలయం ముందు పడిగాపులు దేనికంటూ మండిపడ్డారు.

Janasena spokesperson Pothina Mahesh
జనసేన ప్రతినిధి పోతిన మహేశ్​

దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​పై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్​ విమర్శలు గుప్పించారు. విజయవాడ పంజా సెంటర్​లో ప్రచారాన్ని నిలిపేసి.. తాడేపల్లి కేంద్ర కార్యాలయం ముందు పడిగాపులు ఎందుకని ప్రశ్నించారు. దుర్గ గుడిలో సోదాలు జరుగుతున్నందునా.. లేక దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన అవినీతిపై సంజాయిషీ చెప్పుకోటానికా అంటూ ఆరోపించారు.

మంత్రి పదని పోతుందనే భయంతో సజ్జల రామకృష్ణారెడ్డితో బేరం కుదుర్చుకునేందుకా అంటూ మహేశ్ మండిపడ్డారు. సీఎం జగన్​కు చిత్తశుద్ధి ఉంటే శ్రీనివాస్ పదవీకాలంలోని ప్రతి అంశంపై దర్యాప్తు చేయించాలని డిమాండ్​ చేశారు. వైకాపా ప్రభుత్వం.. అవినీతిరహిత ప్రభుత్వమే అయితే దేవాదాయ శాఖ మంత్రి చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​పై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్​ విమర్శలు గుప్పించారు. విజయవాడ పంజా సెంటర్​లో ప్రచారాన్ని నిలిపేసి.. తాడేపల్లి కేంద్ర కార్యాలయం ముందు పడిగాపులు ఎందుకని ప్రశ్నించారు. దుర్గ గుడిలో సోదాలు జరుగుతున్నందునా.. లేక దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన అవినీతిపై సంజాయిషీ చెప్పుకోటానికా అంటూ ఆరోపించారు.

మంత్రి పదని పోతుందనే భయంతో సజ్జల రామకృష్ణారెడ్డితో బేరం కుదుర్చుకునేందుకా అంటూ మహేశ్ మండిపడ్డారు. సీఎం జగన్​కు చిత్తశుద్ధి ఉంటే శ్రీనివాస్ పదవీకాలంలోని ప్రతి అంశంపై దర్యాప్తు చేయించాలని డిమాండ్​ చేశారు. వైకాపా ప్రభుత్వం.. అవినీతిరహిత ప్రభుత్వమే అయితే దేవాదాయ శాఖ మంత్రి చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు.. జనసేన అభ్యర్థి ఖరారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.