ETV Bharat / city

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షతన వీసీల సదస్సు నేడు

author img

By

Published : May 5, 2022, 5:29 AM IST

Governor Biswabhusan Meeting With VCs: నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షతన విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సు జరగనుంది. రెండేళ్ల తరువాత రాజ్ భవన్ వేదికగా పూర్తిస్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నామని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షతన ఇవాళ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సు జరగనుంది. రాజ్ భవన్ దర్బార్ హాలు వేదికగా నిర్వహించే ఈ సదస్సులో ఉపకులపతులకు ఉన్నత విద్యావ్యవస్ధకు సంబంధించిన పలు అంశాలపై గవర్నర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సదస్సులో గవర్నర్ కులపతి హోదాలో కీలకోపన్యాసం చేయనున్నారు. ఉపకులపతులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఆన్ లైన్ విధానంలోనే గవర్నర్- ఉపకులపతులతో సమావేశం అవుతుండగా...ఈసారి రాజ్ భవన్ వేదికగా పూర్తిస్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షతన ఇవాళ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సు జరగనుంది. రాజ్ భవన్ దర్బార్ హాలు వేదికగా నిర్వహించే ఈ సదస్సులో ఉపకులపతులకు ఉన్నత విద్యావ్యవస్ధకు సంబంధించిన పలు అంశాలపై గవర్నర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సదస్సులో గవర్నర్ కులపతి హోదాలో కీలకోపన్యాసం చేయనున్నారు. ఉపకులపతులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఆన్ లైన్ విధానంలోనే గవర్నర్- ఉపకులపతులతో సమావేశం అవుతుండగా...ఈసారి రాజ్ భవన్ వేదికగా పూర్తిస్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.

ఇదీ చదవండి: పోలవరం భూసేకరణలో భారీ అక్రమాలు.. లబోదిబోమంటున్న బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.