ETV Bharat / city

పోలీసులు ఐపీసీకి బదులు వైసీపీని అమలు చేస్తున్నారు: జవహర్

author img

By

Published : Oct 6, 2020, 6:11 PM IST

మాజీ మంత్రి జవహర్... ప్రభుత్వం, పోలీసులపై మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి తన స్వగృహానికి వెళ్తుంటే అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవటమేంటని ధ్వజమెత్తారు. పోలీసులు ఐపీసీకి బదులు వైసీపీ యాక్ట్ అమలు చేస్తున్నారని ఆరోపించారు.

former minister jawahr fires on police
పోలీసులు ఐపీసీకి బదులు వైకాపాను అమలు చేస్తున్నారు: జవహర్

జగన్ ప్రభుత్వంలో సామాన్యులకు స్వేచ్ఛ అందని ద్రాక్షగానే ఉందని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి తన స్వగృహానికి వెళ్తుంటే అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవటమేంటని ధ్వజమెత్తారు. తన ఇంటికి తాను వెళ్లేందుకు కూడా పాస్​పోర్టులు, వీసాలు కావాలా అని నిలదీశారు. అంబేడ్కర్, జగ్జీవన్ విగ్రహాలకు పూలమాల వేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో ఉన్నామో పాకిస్థాన్​లో ఉన్నామో తెలియట్లేదు

రాష్ట్రంలో పోలీసుల వ్యవహారం చూస్తుంటే... డీజీపీ గౌతం సవాంగ్​తో పాటు కొందరు పోలీసులు అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల టిక్కెట్లు ఆశిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఐపీసీకి బదులుగా వైసీపీని అమలుచేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల చర్యలు చూస్తుంటే ఏపీలో ఉన్నామో పాకిస్థాన్ లో ఉన్నామో అర్థం కావట్లేదని విమర్శించారు.

'అదే.. వైకాపా పాలనా నినాదం'

దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటమే వైకాపా పాలన నినాదంగా సాగుతోందని ఆక్షేపించారు. మంత్రుల ఇసుక దందాను అడ్డుకోలేక కొందరు పోలీసులు తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు రాజ్యం ఎంతోకాలం సాగదని... త్వరలోనే వారిపై ప్రైవేటు కేసులు పెడతామని జవహర్ తెలిపారు.

ఇదీ చదవండి:

ఎర్రంరెడ్డిపాలెంలో నిబంధనలు ఉల్లంఘించి... రిజిస్ట్రేషన్లు!

జగన్ ప్రభుత్వంలో సామాన్యులకు స్వేచ్ఛ అందని ద్రాక్షగానే ఉందని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి తన స్వగృహానికి వెళ్తుంటే అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవటమేంటని ధ్వజమెత్తారు. తన ఇంటికి తాను వెళ్లేందుకు కూడా పాస్​పోర్టులు, వీసాలు కావాలా అని నిలదీశారు. అంబేడ్కర్, జగ్జీవన్ విగ్రహాలకు పూలమాల వేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో ఉన్నామో పాకిస్థాన్​లో ఉన్నామో తెలియట్లేదు

రాష్ట్రంలో పోలీసుల వ్యవహారం చూస్తుంటే... డీజీపీ గౌతం సవాంగ్​తో పాటు కొందరు పోలీసులు అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల టిక్కెట్లు ఆశిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఐపీసీకి బదులుగా వైసీపీని అమలుచేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల చర్యలు చూస్తుంటే ఏపీలో ఉన్నామో పాకిస్థాన్ లో ఉన్నామో అర్థం కావట్లేదని విమర్శించారు.

'అదే.. వైకాపా పాలనా నినాదం'

దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటమే వైకాపా పాలన నినాదంగా సాగుతోందని ఆక్షేపించారు. మంత్రుల ఇసుక దందాను అడ్డుకోలేక కొందరు పోలీసులు తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు రాజ్యం ఎంతోకాలం సాగదని... త్వరలోనే వారిపై ప్రైవేటు కేసులు పెడతామని జవహర్ తెలిపారు.

ఇదీ చదవండి:

ఎర్రంరెడ్డిపాలెంలో నిబంధనలు ఉల్లంఘించి... రిజిస్ట్రేషన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.