ఎస్సీలు, వెనుకబడిన వర్గాలపై తెదేపాది కపటప్రేమేనని వైకాపా రాజ్యసభ అభ్యర్థులు విమర్శించారు. ఆ పార్టీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ నామినేషన్లు దాఖలు చేశారు. తమ అనుభవాన్ని రంగరించి పారిశ్రామికంగా ఏపీకి లబ్ధి జరిగేలా కృషి చేస్తామన్నారు.