తెలంగాణలోని మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి తండాలో దారుణం జరిగింది. అడవి పందుల కోసం రైతులు వేసిన విద్యుత్ తీగలు తగిలి తండ్రీ కొడుకు మరణించారు. తీగల విషయం తెలియక అటుగా వెళ్లగా విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కృష్ణమూర్తి వివరించారు.
ఇదీ చదవండిః
వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద