ఉపాధి హామీ నిధుల బకాయిలకై రేపటినుంచి జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు విజయవాడలో తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ నెలాఖరుకు "ఛలో అమరావతి " జరుపుతామని ప్రకటించారు. నిధుల విడుదలలో జాప్యంపై... హైకోర్టులో కేసు వేస్తామన్నారు. 13 జిల్లాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2500 కోట్ల బకాయిలు విడుదల చేసేవరకు తమ ఉద్యమం ఆగదని... రాజకీయ కక్షతోనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఎమ్మెల్సీ ఆరోపించారు.
ఇదీ చదవండి: గుడివాడలో పోలీసుల నిర్బంధ తనిఖీలు