ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నాణ్యమైన సాఫ్ట్వేర్, ఐటీ ఉత్పత్తులను తయారు చేసే సంస్థలకు అమెరికాలోని సీఎంఎంఐ ఇనిస్టిట్యూట్ ధ్రువపత్రాలను ఇస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 9 ఐటీ సంస్థలు మాత్రమే సీఎంఎంఐ లెవెల్ - 3 సర్టిఫికెట్ కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో విజయవాడకి చెందిన ఎఫ్ ట్రానిక్స్ సంస్థ చేరింది. 30 ఏళ్లుగా ట్రాఫిక్ విభాగంలో వాడే ఎల్ఈడీ లైట్లు, డిస్ప్లే బోర్డులు, వాటి సాఫ్ట్వేర్లపై పరిశోధనలు చేస్తూ వాటిని తయారు చేసి ఈ సంస్ధ సేవలందిస్తోంది. దేశవ్యాప్తంగా రైల్వే లైన్ సిగ్నలింగ్ వ్యవస్థను ఎంతో కాలంగా ఎఫ్ ట్రానిక్స్ నిర్వహిస్తోంది. వీటితో పాటు స్మార్ట్ బిల్డింగ్స్, స్మార్ట్ సిటీల్లో సాంకేతికతను వినియోగించి పలు ప్రాజెక్టులు చేపడుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత సేవలు సైతం అందిస్తోంది. అరుదైన గుర్తింపు సాధించడం పట్ల సంస్థ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: