ETV Bharat / city

'చిరువ్యాపారులు, చేతివృత్తుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి'

author img

By

Published : Aug 21, 2020, 4:33 PM IST

కరోనా సమయంలో చతికిలపడ్డ చిరువ్యాపారులు, చేతివృత్తుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు డిమాండ్​ చేశారు. వీరికి రూ. 10 వేలు ఆర్థిక సాయంతో పాటుగా.. నెలరోజులకు సరిపడా సరకులు అందించాలని విజయవాడ నగర శివారులో ఆందోళన చేశారు.

cpm protest at payakapuram in vijayawada
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు

విజయవాడ నగర శివారు పాయికాపురం ప్రాంతంలో సీపీఎం, అనుబంధ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు పాల్గొని స్థానికులకు సంఘీభావం తెలిపారు. లాక్​డౌన్​ సమయంలో పూర్తిస్థాయిలో దెబ్బతిన్న చేతివృత్తుల కుటుంబాలు, చిరువ్యాపారులకు కేంద్రం రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయాలని కోరారు. అంతేకాకుండా వారికి నెలకి సరిపడా సరకులు అందించాలన్నారు. కరోనా సమయంలో ప్రజలపై భారం వేయొద్దని, పెంచిన విద్యుత్​ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి :

విజయవాడ నగర శివారు పాయికాపురం ప్రాంతంలో సీపీఎం, అనుబంధ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు పాల్గొని స్థానికులకు సంఘీభావం తెలిపారు. లాక్​డౌన్​ సమయంలో పూర్తిస్థాయిలో దెబ్బతిన్న చేతివృత్తుల కుటుంబాలు, చిరువ్యాపారులకు కేంద్రం రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయాలని కోరారు. అంతేకాకుండా వారికి నెలకి సరిపడా సరకులు అందించాలన్నారు. కరోనా సమయంలో ప్రజలపై భారం వేయొద్దని, పెంచిన విద్యుత్​ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి :

విశాఖ, కడప జిల్లాలో సీపీఎం నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.