ETV Bharat / city

రమ్య కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్​

author img

By

Published : Aug 15, 2021, 9:14 PM IST

గుంటూరులో యువతి రమ్య హత్య కేసు పురోగతిపై సీఎం జగన్​ ఆరా తీశారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

CM JAGAN
CM JAGAN

గుంటూరులో యువతి రమ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. యువతి హత్యా ఘటన, కేసు పురోగతిపై సీఎం ఆరా తీశారు. హత్య ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

‘దిశ చట్టం’ కింద దర్యాప్తు వేగంగా చేపట్టి దోషికి కఠినశిక్ష పడేలా చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిహారంగా రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని యువతి కుటుంబానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

గుంటూరులో యువతి రమ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. యువతి హత్యా ఘటన, కేసు పురోగతిపై సీఎం ఆరా తీశారు. హత్య ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

‘దిశ చట్టం’ కింద దర్యాప్తు వేగంగా చేపట్టి దోషికి కఠినశిక్ష పడేలా చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిహారంగా రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని యువతి కుటుంబానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి:

Arrest: రమ్య హత్య కేసులో నిందితుడు అరెస్ట్: డీజీపీ గౌతమ్ సవాంగ్

Murder Video CC Footage: బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. సీసీ కెమరాలో దృశ్యాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.