ETV Bharat / city

ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి: పట్టాభికి చంద్రబాబు ఫోన్ - చంద్రబాబు తాజా వార్తలు

ఇలాంటి సమయంలోనే మనోధైర్యంతో ఉండాలని తెదేపా అధికార ప్రతినిథి పట్టాభికి చంద్రబాబు సూచించారు. కారు ధ్వంసం ఘటనపై ఆయనకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

chandrababu phone to pattabhi
పట్టాభికి చంద్రబాబు ఫోన్
author img

By

Published : Oct 4, 2020, 10:46 AM IST

Updated : Oct 4, 2020, 1:14 PM IST

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​లు ఫోన్ చేసి కారు ధ్వంసం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి సమయంలోనే మనోధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

ఈ ఘటన ఆటవిక రాజ్యం కాక మరేంటని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించే వారిపై వరుస దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. నిన్న సబ్బాం హరి నివాసం, ఇవాళ పట్టాభి కారుపై దాడి సిగ్గుచేటన్న లోకేశ్.. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు.

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​లు ఫోన్ చేసి కారు ధ్వంసం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి సమయంలోనే మనోధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

ఈ ఘటన ఆటవిక రాజ్యం కాక మరేంటని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించే వారిపై వరుస దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. నిన్న సబ్బాం హరి నివాసం, ఇవాళ పట్టాభి కారుపై దాడి సిగ్గుచేటన్న లోకేశ్.. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు.

ఇవీ చదవండి..

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

Last Updated : Oct 4, 2020, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.