విశాఖ జిల్లా పెందుర్తి మండలం గిరిప్రసాద్నగర్కు చెందిన ఎస్సీ యువకుడికి గుండు గీసి, దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. సుజాతనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సినీ నిర్మాత, బిగ్బాస్-2 ఫేమ్ ఎన్.నూతన్నాయుడి ఇంట్లో నాలుగు నెలల క్రితం బాధితుడు పనికి కుదిరాడు. ఈ నెల 1న జీతం తీసుకుని పని మానేశాడు. తమ ఇంట్లో చోరీకి గురైన సెల్ఫోన్ గురించి మాట్లాడాలని నూతన్నాయుడు భార్య గురువారం రాత్రి ఆ యువకుడిని ఇంటికి పిలిపించారు. బాధితుడిపై ఆరోపణలు చేస్తూ.. దాడి చేసి శిరోముండనం చేయించారు. ఆ బాధితుడితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఇదీ చదవండి: కొవిడ్పై సీఎస్కు చంద్రబాబు లేఖ