ETV Bharat / city

విశాఖ శిరోముండనం బాధితుడికి చంద్రబాబు ఫోన్​

author img

By

Published : Aug 30, 2020, 4:37 PM IST

Updated : Aug 30, 2020, 5:34 PM IST

విశాఖ శిరోముండనం బాధితుడితో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. తమ పార్టీ అండగా ఉంటుందని బాధితుడికి భరోసా ఇచ్చారు.

chandrababu phone call to vishaka tonsure victim
chandrababu phone call to vishaka tonsure victim

విశాఖ జిల్లా పెందుర్తి మండలం గిరిప్రసాద్‌నగర్‌కు చెందిన ఎస్సీ యువకుడికి గుండు గీసి, దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. సుజాతనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న సినీ నిర్మాత, బిగ్‌బాస్‌-2 ఫేమ్‌ ఎన్‌.నూతన్‌నాయుడి ఇంట్లో నాలుగు నెలల క్రితం బాధితుడు పనికి కుదిరాడు. ఈ నెల 1న జీతం తీసుకుని పని మానేశాడు. తమ ఇంట్లో చోరీకి గురైన సెల్‌ఫోన్‌ గురించి మాట్లాడాలని నూతన్‌నాయుడు భార్య గురువారం రాత్రి ఆ యువకుడిని ఇంటికి పిలిపించారు. బాధితుడిపై ఆరోపణలు చేస్తూ.. దాడి చేసి శిరోముండనం చేయించారు. ఆ బాధితుడితో చంద్రబాబు ఫోన్​లో మాట్లాడి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

విశాఖ జిల్లా పెందుర్తి మండలం గిరిప్రసాద్‌నగర్‌కు చెందిన ఎస్సీ యువకుడికి గుండు గీసి, దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. సుజాతనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న సినీ నిర్మాత, బిగ్‌బాస్‌-2 ఫేమ్‌ ఎన్‌.నూతన్‌నాయుడి ఇంట్లో నాలుగు నెలల క్రితం బాధితుడు పనికి కుదిరాడు. ఈ నెల 1న జీతం తీసుకుని పని మానేశాడు. తమ ఇంట్లో చోరీకి గురైన సెల్‌ఫోన్‌ గురించి మాట్లాడాలని నూతన్‌నాయుడు భార్య గురువారం రాత్రి ఆ యువకుడిని ఇంటికి పిలిపించారు. బాధితుడిపై ఆరోపణలు చేస్తూ.. దాడి చేసి శిరోముండనం చేయించారు. ఆ బాధితుడితో చంద్రబాబు ఫోన్​లో మాట్లాడి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

ఇదీ చదవండి: కొవిడ్​పై సీఎస్​కు చంద్రబాబు లేఖ

Last Updated : Aug 30, 2020, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.