ETV Bharat / city

ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టింది: చంద్రబాబు

author img

By

Published : Oct 27, 2020, 3:47 PM IST

Updated : Oct 28, 2020, 3:23 AM IST

రైతు భరోసా పేరుతో ఐదేళ్లలో రైతులకు ఇచ్చేది రూ. 37,500 మాత్రమేనని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... వైకాపా ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టిందని ఆరోపించారు. అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసహంరించుకోకపోగా...వారికి సంకెళ్లు వేయటం మానవహక్కుల ఉల్లంఘనేనని ధ్వజమెత్తారు.

ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టింది
ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టింది

ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టింది: చంద్రబాబు

ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలపై ముఖ్యమంత్రి జగన్ మాట తప్పి మడమ తిప్పారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ సీనియర్ నాయకులు,నియోజకవర్గ బాధ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న ఆయన..వైకాపా అధికారంలోకి వచ్చి ఒక్కో రైతులు రూ.77,500 ఎగ్గొట్టిందని ఆరోపించారు. రైతు భరోసా పేరుతో 5 ఏళ్లలో రూ.37,500 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తెదేపా అధికారంలో ఉండిఉంటే అన్నదాత సుఖీభవ, రుణమాఫీ 4, 5 విడతలు కలిపి ఒక్కో రైతుకు రూ. లక్షా 15వేలు వచ్చేదన్నారు. ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి రూ.4వేలకోట్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు.

ఇళ్లు ఇస్తారా? స్వాధీనం చేసుకోమంటారా ?

తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను సంక్రాంతి లోపు పేదలకు స్వాధీనం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేకపోతే తెదేపా ఆధ్వర్యంలో చేపట్టే ప్రజా ఉద్యమం ద్వారా డిపాజిట్లు కట్టిన పేదలే గృహ ప్రవేశాలు చేస్తారని హెచ్చరించారు. "కట్టిన ఇళ్లను, డిపాజిట్లు చెల్లించిన పేదలకు ఇవ్వరా?. ఏడాదిన్నరగా పెండింగ్ బిల్లులు ఎందుకని నిలిపేశారో చెప్పాలి. చట్టాలను మీరు ఉల్లంఘిస్తూ... తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారు. బీసీలపై ప్రేమ ఉంటే ఆదరణ పనిముట్లు ఎందుకు పంపిణీ చేయట్లేదు. కట్టిన లక్షలాది ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ఇళ్లు ఎందుకు మళ్లించారు. బడ్జెట్​లో కోతలు విధించటం నమ్మక ద్రోహం కాదా?. నిత్యవసరాలు, విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచేశారు. హారన్ కొడితే జరిమానాలు విధించడం మరో తుగ్లక్ చర్య. సర్వేరాళ్లపై జగన్ రెడ్డి బొమ్మలు ఇంకో తుగ్లక్ చర్య. తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని అప్రదిష్ఠపాలు చేశారు." అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

గెలిపించిన ఎంపీలను కేసుల మాఫీకి వాడుకుంటున్నారు

22మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్...ఇప్పుడు వారిని తన స్వార్థానికి, కేసుల మాఫీకి వాడుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం పూర్తి చేస్తా, ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్దమనిషి వాటి గురించే ప్రస్తావించటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ బాధ్యత వల్లే 72శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్నారు. దీనిపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి రెండు కళ్లైన అమరావతి, పోలవరాన్ని వైకాపా పొడిచేసిందని ఆక్షేపించారు. 13జిల్లాలను సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చారని ధ్వజమెత్తారు. తెదేపా తెచ్చిన రూ.5 లక్షల భీమా పథకాన్ని ఏడాదిన్నరగా రద్దు చేశారని విమర్శించారు . వరదల్లో నష్టపోయిన బాధితులను వైకాపా నేతలు పరామర్శించకపోగా...పరామర్శకు వెళ్లిన తెదేపా నాయకులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

మానవహక్కుల ఉల్లంఘనకు ముఖ్యమంత్రిదే బాధ్యత

గుంటూరు జిల్లా కృష్ణాయపాళెం ఎస్సీ, బీసీ రైతులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులన్నీ ఉపసంహరించుకోకపోగా వారికి సంకెళ్లు వేయటం మానవహక్కుల ఉల్లంఘనేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. రైతులపై ఎస్సీ అట్రాసీటీ కేసు పెట్టడం సరైంది కాదన్నారు. ఇది రైతు విద్రోహ చర్య అని మండిపడ్డారు. మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా రైతులకు బేడీలు వేయకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే విధంగా పోలీసు చర్య ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్

ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టింది: చంద్రబాబు

ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలపై ముఖ్యమంత్రి జగన్ మాట తప్పి మడమ తిప్పారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ సీనియర్ నాయకులు,నియోజకవర్గ బాధ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న ఆయన..వైకాపా అధికారంలోకి వచ్చి ఒక్కో రైతులు రూ.77,500 ఎగ్గొట్టిందని ఆరోపించారు. రైతు భరోసా పేరుతో 5 ఏళ్లలో రూ.37,500 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తెదేపా అధికారంలో ఉండిఉంటే అన్నదాత సుఖీభవ, రుణమాఫీ 4, 5 విడతలు కలిపి ఒక్కో రైతుకు రూ. లక్షా 15వేలు వచ్చేదన్నారు. ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి రూ.4వేలకోట్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు.

ఇళ్లు ఇస్తారా? స్వాధీనం చేసుకోమంటారా ?

తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను సంక్రాంతి లోపు పేదలకు స్వాధీనం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేకపోతే తెదేపా ఆధ్వర్యంలో చేపట్టే ప్రజా ఉద్యమం ద్వారా డిపాజిట్లు కట్టిన పేదలే గృహ ప్రవేశాలు చేస్తారని హెచ్చరించారు. "కట్టిన ఇళ్లను, డిపాజిట్లు చెల్లించిన పేదలకు ఇవ్వరా?. ఏడాదిన్నరగా పెండింగ్ బిల్లులు ఎందుకని నిలిపేశారో చెప్పాలి. చట్టాలను మీరు ఉల్లంఘిస్తూ... తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారు. బీసీలపై ప్రేమ ఉంటే ఆదరణ పనిముట్లు ఎందుకు పంపిణీ చేయట్లేదు. కట్టిన లక్షలాది ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ఇళ్లు ఎందుకు మళ్లించారు. బడ్జెట్​లో కోతలు విధించటం నమ్మక ద్రోహం కాదా?. నిత్యవసరాలు, విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచేశారు. హారన్ కొడితే జరిమానాలు విధించడం మరో తుగ్లక్ చర్య. సర్వేరాళ్లపై జగన్ రెడ్డి బొమ్మలు ఇంకో తుగ్లక్ చర్య. తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని అప్రదిష్ఠపాలు చేశారు." అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

గెలిపించిన ఎంపీలను కేసుల మాఫీకి వాడుకుంటున్నారు

22మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్...ఇప్పుడు వారిని తన స్వార్థానికి, కేసుల మాఫీకి వాడుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం పూర్తి చేస్తా, ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్దమనిషి వాటి గురించే ప్రస్తావించటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ బాధ్యత వల్లే 72శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్నారు. దీనిపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి రెండు కళ్లైన అమరావతి, పోలవరాన్ని వైకాపా పొడిచేసిందని ఆక్షేపించారు. 13జిల్లాలను సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చారని ధ్వజమెత్తారు. తెదేపా తెచ్చిన రూ.5 లక్షల భీమా పథకాన్ని ఏడాదిన్నరగా రద్దు చేశారని విమర్శించారు . వరదల్లో నష్టపోయిన బాధితులను వైకాపా నేతలు పరామర్శించకపోగా...పరామర్శకు వెళ్లిన తెదేపా నాయకులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

మానవహక్కుల ఉల్లంఘనకు ముఖ్యమంత్రిదే బాధ్యత

గుంటూరు జిల్లా కృష్ణాయపాళెం ఎస్సీ, బీసీ రైతులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులన్నీ ఉపసంహరించుకోకపోగా వారికి సంకెళ్లు వేయటం మానవహక్కుల ఉల్లంఘనేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. రైతులపై ఎస్సీ అట్రాసీటీ కేసు పెట్టడం సరైంది కాదన్నారు. ఇది రైతు విద్రోహ చర్య అని మండిపడ్డారు. మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా రైతులకు బేడీలు వేయకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే విధంగా పోలీసు చర్య ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్

Last Updated : Oct 28, 2020, 3:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.