గతంలో అన్ని వర్గాలను ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని మాజీఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేసిందని వివరించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు... ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్లకు ఇవ్వలేదని ఆరోపించారు.
కాపు కార్పొరేషన్కు రూ.2వేల కోట్లు కేటాయించినా... ఇప్పటిదాకా నిధులు మంజూరు చేయలేన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మహిళలకు రుణాలు, స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపాకు పరిపాలన అనుభవం లేక పేదప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండీ... 'ఉగాది నాటికి పేదలందరికీ ఉచితంగా ఇళ్ల పట్టాలు'