ఎమ్మెల్సీగా గత ఐదున్నరేళ్లుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేశానని ఏయస్ రామకృష్ణ అన్నారు. విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ సహకారంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫిట్మెంట్ 42 శాతానికి పెంచడానికి కృషి చేశానన్నారు.
ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 1వ తేదీన జీతం అందేలా కృషి చేశానని.. బదిలీల సమస్యలను పరిష్కరించానని వివరించారు. మార్చిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల జరగబోతున్నాయని... తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టు చెప్పిన ఆయన.. గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: