ETV Bharat / city

ఉప ఎన్నికలో విచ్చలవిడిగా దొంగఓట్ల బాగోతం: సోము వీర్రాజు

author img

By

Published : Apr 18, 2021, 12:17 PM IST

Updated : Apr 18, 2021, 12:28 PM IST

తిరుపతి ఉప ఎన్నికలో దొంగఓట్ల బాగోతం విచ్చలవిడిగా సాగిందన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్లను బెదిరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించారని ఆక్షేపించారు.

fake voting in tirupati by poll 2021
somu veerraju fiers on ycp
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ రద్దు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మంత్రులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. ఉప ఎన్నికలో దొంగఓట్ల బాగోతం విచ్చలవిడిగా సాగిందన్న ఆయన.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం క్షమాపణ చెప్పాలన్నారు.

వైకాపా ప్రభుత్వం రాజీనామా చేసేవరకు భాజపా-జనసేన ఉద్యమం చేస్తోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఉప ఎన్నిక సమయంలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి, నారాయణస్వామికి పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.ఓటర్లను బెదిరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించారని ఆక్షేపించారు. నవరత్నాలు, అభివృద్ధి గెలిపిస్తాయనుకుంటే ఇన్ని దారుణాలు అవసరమా..? అని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందన్నారు.

ఈ ఎపిసోడ్​కి కారణం మంత్రి రామచంద్రారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరి పేర్లలో రాముడు ఉన్నాడు. రాముడు అబద్ధం చెప్పడు. కానీ వీరిద్దరూ మాత్రం రివర్స్. పోలింగ్ కుట్ర తెదేపా, భాజపా అంటూ సజ్జల మాట్లాడటం దారుణం. కుట్రలకు అకాశం లేకుండానే అన్ని కుట్రలు వైకాపా వాళ్లే చేస్తున్నారు. దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. ప్రశ్నించేవాళ్లపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి

కరోనా భయం గుప్పిట్లో ఏపీ సచివాలయ ఉద్యోగులు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ రద్దు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మంత్రులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. ఉప ఎన్నికలో దొంగఓట్ల బాగోతం విచ్చలవిడిగా సాగిందన్న ఆయన.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం క్షమాపణ చెప్పాలన్నారు.

వైకాపా ప్రభుత్వం రాజీనామా చేసేవరకు భాజపా-జనసేన ఉద్యమం చేస్తోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఉప ఎన్నిక సమయంలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి, నారాయణస్వామికి పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.ఓటర్లను బెదిరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించారని ఆక్షేపించారు. నవరత్నాలు, అభివృద్ధి గెలిపిస్తాయనుకుంటే ఇన్ని దారుణాలు అవసరమా..? అని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందన్నారు.

ఈ ఎపిసోడ్​కి కారణం మంత్రి రామచంద్రారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరి పేర్లలో రాముడు ఉన్నాడు. రాముడు అబద్ధం చెప్పడు. కానీ వీరిద్దరూ మాత్రం రివర్స్. పోలింగ్ కుట్ర తెదేపా, భాజపా అంటూ సజ్జల మాట్లాడటం దారుణం. కుట్రలకు అకాశం లేకుండానే అన్ని కుట్రలు వైకాపా వాళ్లే చేస్తున్నారు. దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. ప్రశ్నించేవాళ్లపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి

కరోనా భయం గుప్పిట్లో ఏపీ సచివాలయ ఉద్యోగులు

Last Updated : Apr 18, 2021, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.