తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈ నెల 15నుంచి శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో గదులు కేటాయించనున్నట్లు తితిదే ప్రకటించింది. కరోనా నేపథ్యంలో క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించిన ఈ వసతి సముదాయాల్లో కేసులు తగ్గుముఖం పట్టడంతో సేవలను నిలిపివేశారు. దశలవారీగా గదులను శానిటైజ్ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తితిదే ప్రకటించింది. కేవలం ఆన్లైన్లో గదులను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించిన తితిదే..ఈ నెల 10 నుంచి బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది.
ఇదీచదవండి