ETV Bharat / city

తిరుమలేశునికి సప్త వాహన సేవలు... దర్శనానికి పోటెత్తిన భక్తులు - radha sapthami celebrations in tirumala

రథ సప్తమి(సూర్య జయంతి)ని పురస్కరించుకుని తిరుమలలో స్వామివారికి సప్త వాహన సేవలు వైభవంగా నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు ఏడు ప్రధాన వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంతో మొదలై వాహన సేవ కన్నులపండువగా జరిగింది.

radha sapthami
radha sapthami
author img

By

Published : Feb 19, 2021, 10:35 AM IST

Updated : Feb 19, 2021, 10:39 PM IST

సూర్యప్రభ వాహన సేవ

రథసప్తమి వేడుకలు తితిదే ఆధ్వర్యంలో తిరుమలలో కన్నుల పండువగా జరిగాయి. సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమై.. చంద్రప్రభ వాహనంతో ఈ వేడుకలు ముగిశాయి. ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మలయప్ప స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తరువాత అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

చిన్నశేష వాహనంపై శ్రీనివాసుడు

11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు స్వామి వారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.

మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు స్వామివారికి చక్రస్నానం చేయించారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై విహరించారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.

గరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామివారు

పోటెత్తిన భక్తులు...

ఒకే రోజున ఏడు వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు భక్త జనసంద్రంగా మారాయి.

కల్పవృక్ష వాహనంపై శ్రీవారు

ఇదీ చదవండి: రియల్ హీరోలకు పది రెట్ల నజరానా పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం

సూర్యప్రభ వాహన సేవ

రథసప్తమి వేడుకలు తితిదే ఆధ్వర్యంలో తిరుమలలో కన్నుల పండువగా జరిగాయి. సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమై.. చంద్రప్రభ వాహనంతో ఈ వేడుకలు ముగిశాయి. ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మలయప్ప స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తరువాత అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

చిన్నశేష వాహనంపై శ్రీనివాసుడు

11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు స్వామి వారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.

మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు స్వామివారికి చక్రస్నానం చేయించారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై విహరించారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.

గరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామివారు

పోటెత్తిన భక్తులు...

ఒకే రోజున ఏడు వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు భక్త జనసంద్రంగా మారాయి.

కల్పవృక్ష వాహనంపై శ్రీవారు

ఇదీ చదవండి: రియల్ హీరోలకు పది రెట్ల నజరానా పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం

Last Updated : Feb 19, 2021, 10:39 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.