'మీ కాళ్లు మొక్కుతా.. నాకు ఇల్లు మంజూరు చేయండి.. భర్త మృతిచెందాడు.. ఉండటానికి గూడు లేదు.. చిన్న పాకలో ఉంటున్నా.. వర్షాల సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నా' అని తిరుపతి జిల్లా సీఎల్ఎన్పల్లి పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన చెంగమ్మ..ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుట కన్నీరుమున్నీరైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం వచ్చిన ఎమ్మెల్యేకు ఈ మేరకు విన్నవించింది. తూర్పు హరిజనవాడకు చెందిన బజ్జమ్మ అనే మరో మహిళ కూడా తన ఆవేదనను వెలిబుచ్చింది. ‘నా భర్త గతంలో చనిపోయాడు. ఆ తర్వాత మూడు నెలలకే కుమారుడు మృతిచెందాడు. ఇప్పటికీ వైఎస్ఆర్ బీమా మంజూరు కాలేదు. రెండేళ్లుగా తిరుగుతున్నా ఫలితం లేకపోయింది’ అని బజ్జమ్మ వాపోయింది.
ఇవీ చదవండి: