ETV Bharat / city

తితిదేను.. జగన్ దేవస్థానంగా మార్చేశారు: భానుప్రకాశ్ రెడ్డి

సీఎం జగన్​పై భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. తితిదే దర్మకర్తల మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు.

author img

By

Published : Mar 6, 2021, 3:27 PM IST

bjp bhanu prakash reddy comments on cm jagan
bjp bhanu prakash reddy comments on cm jagan

ముఖ్యమంత్రి తితిదేను జగన్ దేవస్థానంగా మార్చేశారని భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. తితిదే ధర్మకర్తల మండలిని రాజకీయ పునరావాసంగా చేశారని విమర్శించారు. గతంలో 19 మంది సభ్యులు ఉన్న తితిదే ధర్మకర్తల మండలిని 36 మందికి పెంచారన్నారు. ఈ సంఖ్య సరిపోదన్నట్లు ప్రత్యేక ఆహ్వానితుడిగా శాసనసభ్యుడు మల్లాది విష్ణుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి తితిదేను జగన్ దేవస్థానంగా మార్చేశారని భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. తితిదే ధర్మకర్తల మండలిని రాజకీయ పునరావాసంగా చేశారని విమర్శించారు. గతంలో 19 మంది సభ్యులు ఉన్న తితిదే ధర్మకర్తల మండలిని 36 మందికి పెంచారన్నారు. ఈ సంఖ్య సరిపోదన్నట్లు ప్రత్యేక ఆహ్వానితుడిగా శాసనసభ్యుడు మల్లాది విష్ణుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: వైకాపా పాలన వసూళ్ల మయం: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.