ముఖ్యమంత్రి తితిదేను జగన్ దేవస్థానంగా మార్చేశారని భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. తితిదే ధర్మకర్తల మండలిని రాజకీయ పునరావాసంగా చేశారని విమర్శించారు. గతంలో 19 మంది సభ్యులు ఉన్న తితిదే ధర్మకర్తల మండలిని 36 మందికి పెంచారన్నారు. ఈ సంఖ్య సరిపోదన్నట్లు ప్రత్యేక ఆహ్వానితుడిగా శాసనసభ్యుడు మల్లాది విష్ణుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వైకాపా పాలన వసూళ్ల మయం: చంద్రబాబు