ETV Bharat / city

'ఒడిశా యువతుల నుంచి వివరాలు రాబట్టాల్సి ఉంది' - రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒడిషా నుంచి ముంబాయికి తరలిస్తున్న 15 మంది యువతులు, ఇద్దరు మహిళలను పోలీసులు రాజమహేంద్రవరంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు ఇంకా విచారించాల్సి ఉందని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి తెలిపారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి
author img

By

Published : Apr 28, 2019, 9:19 PM IST

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి

రాజమహేంద్రవరం బొమ్మూరు మహిళా ప్రాంగణంలో ఆశ్రయం పొందుతున్న ఒడిషా యువతులను రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి కలిశారు. వారి గురించి వివరాలు రాబట్టేందుకు ఇంకా విచారించాల్సి ఉందని ఆమె చెప్పారు. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒడిషా నుంచి ముంబాయికి తరలిస్తుండగా 15 మంది యువతులు, ఇద్దరు మహిళలను రాజమహేంద్రవరంలో పోలీసులు పట్టుకున్నారు. వీరిని తొలుత ఛైల్డ్‌ లైన్‌కు, తర్వాత బొమ్మూరు మహిళా ప్రాంగణానికి తరలించారు. ముంబయిలో ఉపాధి కోసం వెళ్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. అయితే మరో కారణం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. యువతులంతా ఒకే వయసువారు కావడం, వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అనుమానించాల్సి వస్తోందని రాజకుమారి అన్నారు. మహిళల అక్రమ రవాణాను అడ్డుకోవడం, మానప్రాణాలకు రక్షణగా మహిళా కమిషన్‌ పని చేస్తుందని చెప్పారు. వీరి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని అలాగే ఒడిషా ప్రభుత్వంతోనూ మాట్లాడతామని చెప్పారు. అప్పటివరకూ మహిళా ప్రాంగణంలోనే రక్షణ, వసతి కల్పిస్తామని రాజకుమారి తెలిపారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి

రాజమహేంద్రవరం బొమ్మూరు మహిళా ప్రాంగణంలో ఆశ్రయం పొందుతున్న ఒడిషా యువతులను రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి కలిశారు. వారి గురించి వివరాలు రాబట్టేందుకు ఇంకా విచారించాల్సి ఉందని ఆమె చెప్పారు. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒడిషా నుంచి ముంబాయికి తరలిస్తుండగా 15 మంది యువతులు, ఇద్దరు మహిళలను రాజమహేంద్రవరంలో పోలీసులు పట్టుకున్నారు. వీరిని తొలుత ఛైల్డ్‌ లైన్‌కు, తర్వాత బొమ్మూరు మహిళా ప్రాంగణానికి తరలించారు. ముంబయిలో ఉపాధి కోసం వెళ్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. అయితే మరో కారణం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. యువతులంతా ఒకే వయసువారు కావడం, వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అనుమానించాల్సి వస్తోందని రాజకుమారి అన్నారు. మహిళల అక్రమ రవాణాను అడ్డుకోవడం, మానప్రాణాలకు రక్షణగా మహిళా కమిషన్‌ పని చేస్తుందని చెప్పారు. వీరి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని అలాగే ఒడిషా ప్రభుత్వంతోనూ మాట్లాడతామని చెప్పారు. అప్పటివరకూ మహిళా ప్రాంగణంలోనే రక్షణ, వసతి కల్పిస్తామని రాజకుమారి తెలిపారు.

ఇవి చూడండి....

క్షేమంగా ఊరెళ్లండి.. మీ ఇంటి భద్రత మాదేనంటున్న పోలీసులు

Intro:యాంకర్ వాయిస్
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం లోని కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా వారికి 20 లక్షల రూపాయల విలువ చేసే బంగారు కిరీటాన్ని ఈరోజు అలంకరించారు బాబాకు స్వర్ణ కిరీటం ఏర్పాటు చేసేందుకు భక్తులు ఎంతగానో సహకరించారని ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ మూర్తి తెలిపారు ఆలయ 8వ వార్షికోత్సవం పురస్కరించుకుని బాబాకు స్వర్ణ కిరీటధారణ గావించారు ఈ సందర్భంగా క్షీరాభిషేకం మహిళలు వ్రతాలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శిరిడి సాయి బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు


Body:శిరిడి సాయిబాబా


Conclusion:బంగారు కిరీటం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.