తెలంగాణలోని ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం వద్ద సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఓ వ్యక్తి దూకేయడంతో క్షేమంగా బయట పడ్డాడు. మహిళలు ఇద్దరు మాత్రం కారులోనే ఇరుక్కుపోయారు. స్థానికులు బయటికి తీయగా అప్పటికే చనిపోయారు. వారిని ఖమ్మం ప్రభుత్వ ప్రధానాస్పత్రికి తరలించారు. అందులో ఓ మహిళ గర్భిణీ. వైద్యులు ఆపరేషన్ చేసి మృత శిశువును బయటికి తీశారు.
మృతులది మానుకోట...
మృతులది మహబూబాద్ జిల్లా చినగూడూరు మండలం జయ్యారం గ్రామం. మరణించిన పోగుల ఇందిర, పోగుల స్వాతి ఇద్దరూ అత్తాకోడళ్లే. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బయట పడిన మహిపాల్ పేర్కొన్నారు. బహిర్భూమి కోసం పక్కన ఆపి, తర్వాత కారు వెనక్కు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్య, తల్లి, కొడుకు ముగ్గురినీ కోల్పోయిన మహిపాల్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.
ఇవీచూడండి: జాతీయ రహదారిపై ప్రమాదం.. ఎమ్మెల్యే మానవత్వం