ETV Bharat / city

ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా రాజధాని లేకపోవడం బాధాకరం - అమరావతికి నెల్లూరు జనసేన నేతల మద్దతు

ఏడేళ్లు గడుస్తున్నా… రాష్ట్రానికి రాజధాని లేకపోవడం బాధాకరమైన విషయమని నెల్లూరు జనసేన పార్టీ నేతలు బాధాకరం వ్యక్తం చేశారు. అమరావతినే రాజధానిగా ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్​ చేశారు. ఆ దిశగా కృష్ణా, గుంటూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి రాజధాని కోసం పోరాడాలని కోరారు.

nellore janasena leaders giving support to capital amaravati
నెల్లూరు జనసేన నాయకులు కిషోర్​ కుమార్​, డాక్టర్​ అజయ్​ కుమార్
author img

By

Published : Aug 4, 2020, 7:56 PM IST

రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా… ఇంకా రాజధాని లేకపోవడం బాధాకరమని నెల్లూరు జనసేన పార్టీ నేతలు కిషోర్​ కుమార్​, డాక్టర్​ అజయ్​ కుమార్​లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే… మన రాష్ట్ర భవిష్యత్తు అథోగతి పాలవుతుందని వాపోయారు. రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్​ చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి రాజధాని కోసం పోరాడాలన్నారు.

ఇదీ చదవండి :

రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా… ఇంకా రాజధాని లేకపోవడం బాధాకరమని నెల్లూరు జనసేన పార్టీ నేతలు కిషోర్​ కుమార్​, డాక్టర్​ అజయ్​ కుమార్​లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే… మన రాష్ట్ర భవిష్యత్తు అథోగతి పాలవుతుందని వాపోయారు. రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్​ చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి రాజధాని కోసం పోరాడాలన్నారు.

ఇదీ చదవండి :

అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ సీపీఐ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.