ETV Bharat / city

'సచివాలయాల్లో ఇంజినీరింగ్​ అసిస్టెంట్స్​కి ఇతర పనులేంటి..?' - పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ వార్తలు

సచివాలయాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్స్​కు సంబంధం లేని పనులు అప్పగిస్తున్నారని... పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు ఆరోపించారు. దీనివల్ల ఇప్పటికే చాలా మంది ఉద్యోగానికి రాజీనామా చేశారని తెలిపారు.

Engineering Assistants in Secretariat facing problems says murali krishna naiud
మురళీకృష్ణ నాయుడు
author img

By

Published : Dec 8, 2019, 9:08 PM IST

మీడియాతో మాట్లాడుతున్న మురళీకృష్ణ నాయుడు

ఇంజినీరింగ్ అసిస్టెంట్స్​ను గ్రామ సచివాలయాల్లో నియమించి... వారికి సంబంధం లేని పనులను అప్పగించటం సమంజసం కాదని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్స్​ ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ఇతర పనులు చేయలేక రాజీనామాలు చేసే పరిస్థితి తలెత్తిందన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే దాదాపు 150 మందికి పైగా రాజీనామా చేశారని తెలిపారు.

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అసోసియేషన్ 39వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నెల్లూరులో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్స్​ను సంబంధిత శాఖల ఆధీనంలో ఉంచాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 25వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం ఆ పనులపై విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం సరికాదని స్పష్టం చేశారు. వేధింపులు ఆపకుంటే సహాయ నిరాకరణ చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

ఎయిర్‌టెల్‌ మొబైల్‌ యాప్‌లో భద్రతా లోపం..!

మీడియాతో మాట్లాడుతున్న మురళీకృష్ణ నాయుడు

ఇంజినీరింగ్ అసిస్టెంట్స్​ను గ్రామ సచివాలయాల్లో నియమించి... వారికి సంబంధం లేని పనులను అప్పగించటం సమంజసం కాదని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్స్​ ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ఇతర పనులు చేయలేక రాజీనామాలు చేసే పరిస్థితి తలెత్తిందన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే దాదాపు 150 మందికి పైగా రాజీనామా చేశారని తెలిపారు.

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అసోసియేషన్ 39వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నెల్లూరులో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్స్​ను సంబంధిత శాఖల ఆధీనంలో ఉంచాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 25వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం ఆ పనులపై విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం సరికాదని స్పష్టం చేశారు. వేధింపులు ఆపకుంటే సహాయ నిరాకరణ చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

ఎయిర్‌టెల్‌ మొబైల్‌ యాప్‌లో భద్రతా లోపం..!

Intro:Ap_Nlr_05_08_Pr_Engineers_Meeting_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ను గ్రామ సచివాలయాల్లో నియమించి వారికి ఇంజనీరింగ్ తో సంబంధం లేని పనులను అప్పగించటం సమంజసం కాదని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు అన్నారు. ఉన్నత చదువులు చదువుకొని ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా ఉన్నవారు ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ఇతర పనులు చేయలేక రాజీనామాలు చేసే పరిస్థితి తలెత్తిందని ఆయన నెల్లూరులో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపు 150 మందికి పైగా రాజీనామా చేశారని తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ 39వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నెల్లూరులో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ను ఆయా శాఖల ఆధీనంలో ఉంచాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 25వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం ఆ పనులపై విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం భావ్యం కాదన్నారు. వేధింపులు ఆపకుంటే సహాయ నిరాకరణ చేపడతామని హెచ్చరించారు.
బైట్: మురళీకృష్ణ నాయుడు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.