సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎస్టీయూ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ను రద్దు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. ముడేళ్లు గడుస్తున్నా ఎందుకు రద్దు చేయంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకుంటే.. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: HC Justice: మల్లన్న సేవలో హైకోర్టు సీజే దంపతులు .. శేషవస్త్రాలు , ప్రసాదాలు అందజేత