ETV Bharat / city

THREE CAPITALS: 'మూడు రాజధానులకే మా మద్ధతు.. అందుకు ఎంతవరకైనా వెళ్తాం' - అమరావతి

ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు తాము మద్దతు ఇస్తున్నామని అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు కర్నూలు​లో అన్నారు. రాష్ట్రంలో ఒకే రాజధాని ఉంటే అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమవుతుందని తెలిపారు.

అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు
అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు
author img

By

Published : Nov 12, 2021, 10:47 PM IST

రాష్ట్రంలో ఒకే రాజధాని ఉంటే అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమవుతుందని అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు కర్నూలు​లో అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు. కర్నూలుకు హైకోర్టు కోసం తాము కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైకోర్టు కోసం ఎంతవరకైనా పోరాటాలు చేస్తామని ప్రకటించారు.

'అధికార వికేంద్రీకరణ - మూడు రాజధానులు' ఏర్పాటు అనే అంశంపై ఈ నెల 15వ తేదీన కర్నూలులో సదస్సు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ సదస్సులో మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని మూడు రాజధానులు అంశంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని జేఏసీ నాయకులు కోరారు.

రాష్ట్రంలో ఒకే రాజధాని ఉంటే అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమవుతుందని అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు కర్నూలు​లో అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు. కర్నూలుకు హైకోర్టు కోసం తాము కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైకోర్టు కోసం ఎంతవరకైనా పోరాటాలు చేస్తామని ప్రకటించారు.

'అధికార వికేంద్రీకరణ - మూడు రాజధానులు' ఏర్పాటు అనే అంశంపై ఈ నెల 15వ తేదీన కర్నూలులో సదస్సు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ సదస్సులో మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని మూడు రాజధానులు అంశంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని జేఏసీ నాయకులు కోరారు.

ఇదీ చదవండి:

''అధికారాన్ని వికేంద్రీకరించండి.. హై కోర్టు ఏర్పాటు చేయండి''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.