ETV Bharat / city

రూ. 28 లక్షల చోరీ కేసు.. నలుగురు అరెస్ట్​ - క్రైమ్​ వార్తలు

గత నెల కర్నూలులో చోరీ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి సొమ్మును రికవరీ చేసి అరెస్ట్​ చేశారు. వారిని తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు.

four accused arrested by police in a robbery case
చోరీ కేసులో నలుగురు తెలంగాణ నిందితులు అరెస్ట్​
author img

By

Published : May 6, 2021, 9:53 PM IST

కర్నూలులో జరిగిన ఓ దొంగతనం కేసులో తెలంగాణకు చెందిన నలుగురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని కృష్ణా నగర్ వద్ద ఉన్న శక్తి మార్కెటింగ్​ సంస్థలో ఆ ముఠా... ఏప్రిల్ 2 న రూ. 28 లక్షలు చోరీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి పట్టుబడివారిలో.. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన యూసఫ్ పై ఇప్పటికే 10 కేసులు ఉన్నట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. యూసఫ్​తో పాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 28 లక్షల నగదుతో పాటు ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ఇవీ చదవండి:

కర్నూలులో జరిగిన ఓ దొంగతనం కేసులో తెలంగాణకు చెందిన నలుగురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని కృష్ణా నగర్ వద్ద ఉన్న శక్తి మార్కెటింగ్​ సంస్థలో ఆ ముఠా... ఏప్రిల్ 2 న రూ. 28 లక్షలు చోరీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి పట్టుబడివారిలో.. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన యూసఫ్ పై ఇప్పటికే 10 కేసులు ఉన్నట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. యూసఫ్​తో పాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 28 లక్షల నగదుతో పాటు ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ఇవీ చదవండి:

ప్రయాణికులు లేక రద్దవుతున్న రైళ్లు

కర్నూలులో కరోనా నియంత్రణపై.. అఖిలపక్ష సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.