ETV Bharat / city

మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి వెండి నాగాభరణం - kakinada latest news

కాకినాడ సమీప గ్రామంలో ఉన్న మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తుడు నాగాభరణం బహుకరించారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అలంకరించారు.

nagabharam given by jewellery shop owner to mandeswara subrahmanya swamy temple in kakinada
మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తుడు బహుకరణ
author img

By

Published : Aug 17, 2020, 9:16 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెంలో వేంచేసి ఉన్న మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు నాగాభరణం బహుకరించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో జోగా సత్యనారాయణ తెలిపారు. కాకినాడకు చెందిన ప్రముఖ నగల దుకాణం వ్యాపారి మహేంద్ర కుమార్​ సుమారు రూ. 1.30 లక్షలు విలువ చేసే వెండి నాగాభరణం స్వామివారికి అందించినట్లు ఈవో చెప్పారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అలంకరించినట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్​ సూరంపూడి మాధవ్​, అర్చకులు దత్తు మాధవ తదితరులు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెంలో వేంచేసి ఉన్న మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు నాగాభరణం బహుకరించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో జోగా సత్యనారాయణ తెలిపారు. కాకినాడకు చెందిన ప్రముఖ నగల దుకాణం వ్యాపారి మహేంద్ర కుమార్​ సుమారు రూ. 1.30 లక్షలు విలువ చేసే వెండి నాగాభరణం స్వామివారికి అందించినట్లు ఈవో చెప్పారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అలంకరించినట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్​ సూరంపూడి మాధవ్​, అర్చకులు దత్తు మాధవ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులపై పాలకమండలి దృష్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.