కడప జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి దౌర్జన్యాలు, బెదిరింపులు జరగకుండా తమ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని.. ఎస్పీ అన్బురాజన్కు తెదేపా నేతలు విన్నవించారు. ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుంటే మరో పంచాయతీ నాయకులు ఆయా గ్రామాల్లో తిరగకుండా కట్టడి చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి కోరినట్లు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాల మోహరింపును పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
పులివెందులలో తెదేపా మద్ధతుదారులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు పోలీసులే ఫోన్లు చేసి.. ఎన్నికలకు దూరంగా ఉండాలని బెదిరిస్తున్నారని ఎస్పీకి తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఫిర్యాదు చేశారు. జిల్లాలో గన్మెన్లున్న నాయకులపై షాడో బృందాలతో నిఘా పెట్టాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎస్పీ చెప్పినట్లు తెదేపా నేతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం కొన్నిచోట్ల ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు తప్ప.. తెదేపా పోటీ చేయడం లేదనేది వార్తలు వాస్తవం కావని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: