ETV Bharat / city

Students Protest: సమస్యల పరిష్కారానికి విద్యార్థుల 'పోరు బాట'

author img

By

Published : Mar 16, 2022, 8:08 PM IST

Students Protest: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్​ఐ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జీవో 35, 77 రద్దు సహా పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ పోరాటం చేస్తామని విద్యార్థులు తేల్చిచెప్పారు.

Students Protest
సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు
సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు

Students Protest: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు కదం తొక్కారు. ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జీవో 35, 77 రద్దు సహా పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ పోరాటం చేస్తామని విద్యార్థులు తేల్చిచెప్పారు.

సుమారు 1900 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎస్​ఎఫ్​​ఐ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. జీవో నెంబర్ 35,77లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ సమస్యలకు తక్షణం పరిష్కారం చూపాలంటూ కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సమస్యల పరిష్కారానికి ఎస్​​ఎఫ్​​ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కడపలో ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా వచ్చిన విద్యార్థి సంఘం నేతలను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: Movie Maker Sukumar: అభిమానం... 'పంట పడింది'...

సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు

Students Protest: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు కదం తొక్కారు. ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జీవో 35, 77 రద్దు సహా పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ పోరాటం చేస్తామని విద్యార్థులు తేల్చిచెప్పారు.

సుమారు 1900 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎస్​ఎఫ్​​ఐ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. జీవో నెంబర్ 35,77లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ సమస్యలకు తక్షణం పరిష్కారం చూపాలంటూ కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సమస్యల పరిష్కారానికి ఎస్​​ఎఫ్​​ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కడపలో ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా వచ్చిన విద్యార్థి సంఘం నేతలను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: Movie Maker Sukumar: అభిమానం... 'పంట పడింది'...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.