ETV Bharat / city

LOCK: రెండేళ్లైనా చెల్లించని బిల్లులు.. సచివాలయానికి తాళం - వైఎస్సార్​ జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

contractor lock to secretariat: వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేట మండలం అప్పన్నపల్లి గ్రామ సచివాలయానికి గుత్తేదారు తాళం వేశారు. సచివాలయం నిర్మాణానికి రూ.48 లక్షలు ఖర్చు చేశానన్నారు. రెండేళ్లు అవుతున్నా బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయానికి తాళం వేయడంతో ఉద్యోగులు చెట్టు కింద కూర్చున్నారు.

Village Secretariat Locked
గ్రామ సచివాలయానికి తాళం
author img

By

Published : Apr 27, 2022, 12:19 PM IST

Updated : Apr 27, 2022, 1:03 PM IST

వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం అప్పన్నపల్లి గ్రామ సచివాలయానికి గుత్తేదారు తాళం వేశారు. గ్రామ సచివాలయం నిర్మించి రెండేళ్లు అవుతున్నా అధికారులు బిల్లులు చెల్లించలేదని కారణంతో గుత్తేదారు వాసుదేవరెడ్డి ఇవాళ ఉదయం సచివాలయానికి తాళం వేశారు. 48 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయానికి సంబంధిత పంచాయతీ అధికారులు పర్సెంటేజ్ తీసుకున్నప్పటికీ ఇంతవరకు బిల్లు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాసుదేవ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ సచివాలయానికి తాళం

సచివాలయాన్ని 2020 అక్టోబర్ 2వ తేదీన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు. అప్పటినుంచి కూడా పలుమార్లు అధికారులకు వెళ్లినప్పటికీ స్పందించలేదని తెలిపారు. తనకు బిల్లు చెల్లించే వరకు సచివాలయం తలుపులు తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో సచివాలయానికి విధుల నిర్వహణకు వచ్చిన ఉద్యోగులు తాళం వేసి ఉండటంతో బయట చెట్ల కింద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చదవండి: Attack: విశాఖ కేజీహెచ్‌లో అరాచకం.. ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వద్దన్నందుకు దాడి

వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం అప్పన్నపల్లి గ్రామ సచివాలయానికి గుత్తేదారు తాళం వేశారు. గ్రామ సచివాలయం నిర్మించి రెండేళ్లు అవుతున్నా అధికారులు బిల్లులు చెల్లించలేదని కారణంతో గుత్తేదారు వాసుదేవరెడ్డి ఇవాళ ఉదయం సచివాలయానికి తాళం వేశారు. 48 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయానికి సంబంధిత పంచాయతీ అధికారులు పర్సెంటేజ్ తీసుకున్నప్పటికీ ఇంతవరకు బిల్లు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాసుదేవ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ సచివాలయానికి తాళం

సచివాలయాన్ని 2020 అక్టోబర్ 2వ తేదీన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు. అప్పటినుంచి కూడా పలుమార్లు అధికారులకు వెళ్లినప్పటికీ స్పందించలేదని తెలిపారు. తనకు బిల్లు చెల్లించే వరకు సచివాలయం తలుపులు తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో సచివాలయానికి విధుల నిర్వహణకు వచ్చిన ఉద్యోగులు తాళం వేసి ఉండటంతో బయట చెట్ల కింద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చదవండి: Attack: విశాఖ కేజీహెచ్‌లో అరాచకం.. ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వద్దన్నందుకు దాడి

Last Updated : Apr 27, 2022, 1:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.