ETV Bharat / city

నీటి సంరక్షణలో దక్షిణాది రాష్ట్రాల్లో కడప జిల్లాకు అగ్రస్థానం

దేశంలోని 255 జిల్లాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన జలశక్తి అభియాన్ పథకంలో దక్షిణాధి రాష్ట్రాల్లో కడపజిల్లాకు ప్రథమ స్థానం లభించింది. నీటి సంరక్షణ, వాననీటిని పొదుపు చేయడం... తద్వార భూగర్భజలాలు గణనీయంగా పెంపొందించేందుకు చేపట్టిన పనులకు గానూ జలశక్తి అభియాన్ పథకం కింద అవార్డు వరించింది. రెండేళ్లలో జిల్లాలో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల ద్వారా భూగర్భ జలాలు పెంపొందడంతో పురస్కారాలు వరించాయి. జిల్లాకు అవార్డు రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Nov 13, 2020, 3:50 PM IST

kadapa-district-tops-the-list-of-southern-states-in-water-conservation
నీటి సంరక్షణలో దక్షిణాది రాష్ట్రాల్లో కడప జిల్లాకు అగ్రస్థానం

కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా కరవు ప్రభావం అధికంగా ఉన్న 255 జిల్లాల్లో నీటిని పొదుపు చేయాలనే ఉద్దేశంతో జలశక్తి అభియాన్ అనే కార్యక్రమం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 జిల్లాలో ఈ పథకం అమలైంది. కడప జిల్లాలోని 13 మండలాల్లో జలశక్తి అభియాన్ పథకం అమలు చేశారు. 2019లో చేపట్టిన పనులకు గానూ 255 జిల్లాల్లో ర్యాంకుల ఆధారంగా మార్కులు ప్రకటించిన కేంద్ర జలశక్తి అభియాన్ అధికారులు.. దక్షిణాధి రాష్ట్రాల్లో కడపజిల్లాకు ప్రథమ స్థానం ప్రకటించారు. ఇందులో భాగంగా చిన్నమండెం, లింగాల, సింహాద్రిపురం, ఓబులవారిపల్లె, పెనగలూరు, సంబేపల్లి, రాజంపేట, వేముల, వేంపల్లె మండలాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి.

జిల్లాలో రెండేళ్లలో దాదాపు 18 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకిందని అధికారులు అంటున్నారు. జలశక్తి అభియాన్​లో భాగంగా ఉపాధి హామీ పథకం కింద 19వేల 829 పనులు చేపట్టగా... ఇతర విభాగంలో లక్షా 98 వేల పనులు చేశారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వంద శాతం పనులకు జియో ట్యాగింగ్ చేశారు. దాదాపు నాలుగు నెలల కాలంలో 60 వేల కిసాన్ మేళాలు నిర్వహించారు. దీని ద్వారా రైతులకు, మహిళకు ఉపాధి పనులు, భూగర్భజలాల వృద్ధిపై అవగాహన కల్పించారు. మొత్తం 100 మార్కులకు కడప జిల్లాకు 84.84 మార్కులు రావడంతో దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

వరుసగా రెండేళ్లు అగ్రస్థానం..

జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు చేపట్టిన జలశక్తి అభియాన్ పథకంలో... ప్రధానంగా ఐదు అంశాల ఆధారంగా కేంద్రం మార్కులు కేటాయించింది. ఎంపిక చేసిన జిల్లాలు... వాటి పరిధిలో వాన నీటి సంరక్షణ నిర్మాణాలు, సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, రీచార్జ్ నిర్మాణాల ద్వారా బోరు బావులు పునరుద్ధరించడం, వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలు, విస్తృత అటవీకరణ వంటి విభాగాల్లో మంచి ప్రతిభ కనబరిచిన జిల్లాలకు కేంద్ర జలశక్తి అభియాన్ ర్యాంకులు కేటాయించింది.

జలశక్తి అభియాన్ పథకాన్ని కడప జిల్లాలో విస్తృతంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టిన అధికారులు.... 60,207 కిసాన్ మేళాల ద్వారా రైతులకు వాననీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈవిధంగా కందకాలు, పారంపాండులు, వర్షపు నీటిని వొడిసిపట్టడం, మొక్కల పెంపకం, వాటర్ షెడ్లు నిర్మించడం విస్తృతంగా చేపట్టారు. ఈ ఫలితాల ఆధారంగానే జిల్లాకు వరసగా రెండోసారి ప్రథమ స్థానం వరించింది. 2018లో చేపట్టిన పనులకు కూడా ఇదే విధంగా ప్రథమ ర్యాంకు వచ్చింది. పనులు వేగవంతం చేయడం, సిబ్బంది రేయింబవళ్లు సెలవులు తీసుకోకుండా పనిచేయడం వంటి అంశాలు కలిసొచ్చాయి.

జలశక్తి అభియాన్ కింద మొదటి విడతలో 255 జిల్లాల్లో దక్షిణాధిలో కడపజిల్లా ప్రథమ స్థానం రావడంతో బాధ్యత మరింత పెరిగిందని డ్వామా పీడీ అన్నారు. మరింత ఉత్సాహంతో రాబోయో రోజుల్లో ఉపాధి హామీ పనులు చేపడతామన్నారు.

ఇదీ చదవండి:

గాడి తప్పిన ‘ఫాస్టాగ్‌’ వరుసల నిర్వహణ...టోల్‌గేట్ల వద్ద తప్పని నిరీక్షణ

కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా కరవు ప్రభావం అధికంగా ఉన్న 255 జిల్లాల్లో నీటిని పొదుపు చేయాలనే ఉద్దేశంతో జలశక్తి అభియాన్ అనే కార్యక్రమం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 జిల్లాలో ఈ పథకం అమలైంది. కడప జిల్లాలోని 13 మండలాల్లో జలశక్తి అభియాన్ పథకం అమలు చేశారు. 2019లో చేపట్టిన పనులకు గానూ 255 జిల్లాల్లో ర్యాంకుల ఆధారంగా మార్కులు ప్రకటించిన కేంద్ర జలశక్తి అభియాన్ అధికారులు.. దక్షిణాధి రాష్ట్రాల్లో కడపజిల్లాకు ప్రథమ స్థానం ప్రకటించారు. ఇందులో భాగంగా చిన్నమండెం, లింగాల, సింహాద్రిపురం, ఓబులవారిపల్లె, పెనగలూరు, సంబేపల్లి, రాజంపేట, వేముల, వేంపల్లె మండలాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి.

జిల్లాలో రెండేళ్లలో దాదాపు 18 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకిందని అధికారులు అంటున్నారు. జలశక్తి అభియాన్​లో భాగంగా ఉపాధి హామీ పథకం కింద 19వేల 829 పనులు చేపట్టగా... ఇతర విభాగంలో లక్షా 98 వేల పనులు చేశారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వంద శాతం పనులకు జియో ట్యాగింగ్ చేశారు. దాదాపు నాలుగు నెలల కాలంలో 60 వేల కిసాన్ మేళాలు నిర్వహించారు. దీని ద్వారా రైతులకు, మహిళకు ఉపాధి పనులు, భూగర్భజలాల వృద్ధిపై అవగాహన కల్పించారు. మొత్తం 100 మార్కులకు కడప జిల్లాకు 84.84 మార్కులు రావడంతో దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

వరుసగా రెండేళ్లు అగ్రస్థానం..

జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు చేపట్టిన జలశక్తి అభియాన్ పథకంలో... ప్రధానంగా ఐదు అంశాల ఆధారంగా కేంద్రం మార్కులు కేటాయించింది. ఎంపిక చేసిన జిల్లాలు... వాటి పరిధిలో వాన నీటి సంరక్షణ నిర్మాణాలు, సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, రీచార్జ్ నిర్మాణాల ద్వారా బోరు బావులు పునరుద్ధరించడం, వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలు, విస్తృత అటవీకరణ వంటి విభాగాల్లో మంచి ప్రతిభ కనబరిచిన జిల్లాలకు కేంద్ర జలశక్తి అభియాన్ ర్యాంకులు కేటాయించింది.

జలశక్తి అభియాన్ పథకాన్ని కడప జిల్లాలో విస్తృతంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టిన అధికారులు.... 60,207 కిసాన్ మేళాల ద్వారా రైతులకు వాననీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈవిధంగా కందకాలు, పారంపాండులు, వర్షపు నీటిని వొడిసిపట్టడం, మొక్కల పెంపకం, వాటర్ షెడ్లు నిర్మించడం విస్తృతంగా చేపట్టారు. ఈ ఫలితాల ఆధారంగానే జిల్లాకు వరసగా రెండోసారి ప్రథమ స్థానం వరించింది. 2018లో చేపట్టిన పనులకు కూడా ఇదే విధంగా ప్రథమ ర్యాంకు వచ్చింది. పనులు వేగవంతం చేయడం, సిబ్బంది రేయింబవళ్లు సెలవులు తీసుకోకుండా పనిచేయడం వంటి అంశాలు కలిసొచ్చాయి.

జలశక్తి అభియాన్ కింద మొదటి విడతలో 255 జిల్లాల్లో దక్షిణాధిలో కడపజిల్లా ప్రథమ స్థానం రావడంతో బాధ్యత మరింత పెరిగిందని డ్వామా పీడీ అన్నారు. మరింత ఉత్సాహంతో రాబోయో రోజుల్లో ఉపాధి హామీ పనులు చేపడతామన్నారు.

ఇదీ చదవండి:

గాడి తప్పిన ‘ఫాస్టాగ్‌’ వరుసల నిర్వహణ...టోల్‌గేట్ల వద్ద తప్పని నిరీక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.