ETV Bharat / city

విద్య ప్రోత్సాహానికి రామినేని ఫౌండేషన్​ పురస్కారాలు - 106 మందికి గురు పురస్కారాలు

ఏటా గుంటూరులో ప్రదానం చేసే ప్రతిభ, గురు పురస్కారాలు, గురు సన్మానాలను ఈ నెల 9న సిద్ధార్ధ గార్డెన్స్​లో ఇవ్వనున్నారని రామినేని ఫౌండేషన్​ సంస్థ ఛైర్మన్​ తెలిపారు.

విద్యను ప్రోత్సహించేందుకు రామినేని ఫౌండేషన్​ పురస్కారాలు
author img

By

Published : Oct 5, 2019, 11:28 PM IST

విద్యను ప్రోత్సహించేందుకు రామినేని ఫౌండేషన్​ పురస్కారాలు

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా గురు సన్మానాలు, గురు, ప్రతిభా పురస్కారాలను రామినేని ఫౌండేషన్​ ప్రదానం చేస్తుంది. ఈ నెల 9న గుంటూరులోని సిద్ధార్ధ గార్డెన్స్​లో 106 మందికి గురు పురస్కారాలు, 84 మందికి గురు సన్మానాలు నిర్వహించనుంది. అలాగే జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన 261 విద్యార్ధులకు ప్రతిభా పురస్కారం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ ధర్మ ప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుని ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానాలను అధిరోహించారని.. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో తమ సంస్థ పని చేస్తుందని వారు చెప్పారు.

విద్యను ప్రోత్సహించేందుకు రామినేని ఫౌండేషన్​ పురస్కారాలు

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా గురు సన్మానాలు, గురు, ప్రతిభా పురస్కారాలను రామినేని ఫౌండేషన్​ ప్రదానం చేస్తుంది. ఈ నెల 9న గుంటూరులోని సిద్ధార్ధ గార్డెన్స్​లో 106 మందికి గురు పురస్కారాలు, 84 మందికి గురు సన్మానాలు నిర్వహించనుంది. అలాగే జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన 261 విద్యార్ధులకు ప్రతిభా పురస్కారం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ ధర్మ ప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుని ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానాలను అధిరోహించారని.. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో తమ సంస్థ పని చేస్తుందని వారు చెప్పారు.

ఇదీ చదవండి :

జిల్లాలో రెండో ర్యాంక్​ వచ్చిన ఉద్యోగం రాలేదు...

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.