తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ అశోక్బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, గంజి చిరంజీవి, గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఏవీ రమణ, దారపనేని నరేంద్రబాబు, వల్లూరి కిరణ్, కుమార స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీచదవండి. కారు చీకట్లు..జోరు వాన.. భయంతో ఉన్న ఆ యువతి ఇంటికి చేరిందా?