నియామకాలను వెంటనే చేపట్టాలని డీఎస్సీ-2018 అభ్యర్థులు సీఎం కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. 'స్పందన' కార్యక్రమంలో అభ్యర్థుల దరఖాస్తు చేశారు. కోర్టు కేసులు లేని డీఎస్సీ-2018 పోస్టులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. కోర్టు కేసులున్న పోస్టులను నియామక ప్రక్రియ వేగంగా చేయాలని విజ్ణప్తి చేశారు.
దీనికి స్పందించిన సీఎంవో కార్యలయం... విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణికి ఫోన్ చేశారు. నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాశాఖ కమిషనర్ను కలవాలన్న సీఎంవో సూచన మేరకు 300పైగా అభ్యర్థులు ఇబ్రహీంపట్నంలోని విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. సత్వరమే తమసమస్య పరిష్కరించాలని కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి