ETV Bharat / city

అనాథగా అంతిమయాత్ర..!

కరోనా మహమ్మారి అనుబంధాలను దూరం చేసింది. కరోనా పాజిటివ్​ వచ్చిన వ్యక్తి మరణిస్తే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాని దుస్థితిని తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నప్పటికీ కడసారి చూపులకు నోచుకోలేని స్థితిలో చివరికి ఆసుపత్రి సిబ్బంది, నగరపాలక సంస్థ ఉద్యోగులే అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన గుంటూరులో జరిగింది.

author img

By

Published : Apr 11, 2020, 7:35 AM IST

అనాథగా అంతిమయాత్ర..!
అనాథగా అంతిమయాత్ర..!

గుంటూరు ప్రభుత్వ జ్వరాల వైద్యశాలలో చికిత్స పొందుతూ ఈనెల 7న ఓ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అవటంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఆసుపత్రిలో ఉన్న వివరాల ఆధారంగా నరసరావుపేటలోని మృతుడి బంధువులకు సమాచారం అందజేసినా ఎవరూ రాలేదని వైద్యులు తెలిపారు. వారంతా క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనలు, నిబంధనలు పాటించి.. భౌతికకాయాన్ని శుక్రవారం స్థానిక స్తంభాలగర్వులో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేసినట్లు వెల్లడించారు.

గుంటూరు ప్రభుత్వ జ్వరాల వైద్యశాలలో చికిత్స పొందుతూ ఈనెల 7న ఓ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అవటంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఆసుపత్రిలో ఉన్న వివరాల ఆధారంగా నరసరావుపేటలోని మృతుడి బంధువులకు సమాచారం అందజేసినా ఎవరూ రాలేదని వైద్యులు తెలిపారు. వారంతా క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనలు, నిబంధనలు పాటించి.. భౌతికకాయాన్ని శుక్రవారం స్థానిక స్తంభాలగర్వులో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: కరోనా ప్రభావం.. అపార్ట్‌మెంట్లలో అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.