ETV Bharat / city

గుంటూరు.. తండాల నుంచి పసిపాపను తీసుకొచ్చి.. - Guntur Child Trafficking latest news

17 రోజుల పసికందును తెచ్చిన మహిళను గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. వినుకొండ సమీపంలోని తండాల నుంచి పసిపాపను తీసుకువచ్చినట్లు గుర్తించారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్​లో సదరు మహిళపై చైల్డ్​లైన్ అధికారులు ఫిర్యాదు చేశారు.

child trafficking in Guntur District
తండాల నుంచి పసిపాపను తీసుకొచ్చి..
author img

By

Published : Sep 21, 2020, 5:16 AM IST

ఎలాంటి దత్తత పత్రాలు లేకుండా... అక్రమంగా 17 రోజుల పసికందును తెచ్చిన మహిళను గుంటూరు పోలీసులు, చైల్డ్​లైన్ అధికారులు పట్టుకున్నారు. మారుతీనగర్​లోని నాయీబ్రాహ్మణ కాలనీలో తనిఖీలు చేసిన పోలీసులు... రాజ్యలక్ష్మి అనే మహిళ వినుకొండ సమీపంలోని తండాల నుంచి పసిపాపను తీసుకువచ్చినట్లు గుర్తించారు. చట్టవిరుద్ధంగా దత్తత పత్రాలు లేకుండా పసిపాపను తీసుకువచ్చారంటూ.. రాజ్యలక్ష్మిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్​లో అధికారులు ఫిర్యాదు చేశారు.

ఎలాంటి దత్తత పత్రాలు లేకుండా... అక్రమంగా 17 రోజుల పసికందును తెచ్చిన మహిళను గుంటూరు పోలీసులు, చైల్డ్​లైన్ అధికారులు పట్టుకున్నారు. మారుతీనగర్​లోని నాయీబ్రాహ్మణ కాలనీలో తనిఖీలు చేసిన పోలీసులు... రాజ్యలక్ష్మి అనే మహిళ వినుకొండ సమీపంలోని తండాల నుంచి పసిపాపను తీసుకువచ్చినట్లు గుర్తించారు. చట్టవిరుద్ధంగా దత్తత పత్రాలు లేకుండా పసిపాపను తీసుకువచ్చారంటూ.. రాజ్యలక్ష్మిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్​లో అధికారులు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 7,738 కరోనా కేసులు, 57 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.