ETV Bharat / city

దారుణం: సేవ చేయలేక తల్లి గొంతు కోసి చంపిన కుమారుడు

కన్న కొడుకే ఆ తల్లి పట్ల కాల యముడయ్యాడు. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని కర్కశంగా గొంతు కోసి చంపాడు. అనారోగ్యంతో మంచాన పడి ఉన్న మాతృమూర్తికి సేవ చేయలేక.. తాగిన మైకంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ కర్కశ కొడుకు పరారీలో ఉండగా పోలీసులు విచారణ చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన ఘటన వివరాలివి..!

author img

By

Published : Jul 20, 2020, 10:04 PM IST

Updated : Jul 20, 2020, 10:44 PM IST

మాతృమూర్తికి సేవ చేయలేక.. గొంతు కోసి చంపిన కుమారుడు
మాతృమూర్తికి సేవ చేయలేక.. గొంతు కోసి చంపిన కుమారుడు

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. రామకృష్ణ అనే వ్యక్తి.. అనారోగ్యంతో మంచాన పడి ఉన్న తన తల్లి లీలావతిని గొంతుకోసి హత్య చేశాడు. పట్టణంలోని సుద్దగుంతల వీధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ప్రాంతం రెడ్​జోన్​లో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

హైదరాబాద్​ నుంచి వచ్చిన రామకృష్ణ.. 15 రోజులుగా వృద్ధురాలైన తల్లికి సేవ చేయలేకే.. తాగిన మైకంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతురాలికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇంకా ఫలితం రావాల్సి ఉంది.

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. రామకృష్ణ అనే వ్యక్తి.. అనారోగ్యంతో మంచాన పడి ఉన్న తన తల్లి లీలావతిని గొంతుకోసి హత్య చేశాడు. పట్టణంలోని సుద్దగుంతల వీధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ప్రాంతం రెడ్​జోన్​లో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

హైదరాబాద్​ నుంచి వచ్చిన రామకృష్ణ.. 15 రోజులుగా వృద్ధురాలైన తల్లికి సేవ చేయలేకే.. తాగిన మైకంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతురాలికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇంకా ఫలితం రావాల్సి ఉంది.

ఇదీ చూడండి..

గోపాలపట్నంలో ఓ ఇంట్లో చోరీ.. నగదు, బంగారం ఆపహరణ

Last Updated : Jul 20, 2020, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.