ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3pm

.

author img

By

Published : Dec 24, 2020, 3:15 PM IST

3pm_Topnews
ప్రధాన వార్తలు @ 3pm
  • 'ఇళ్ల పట్టాల పేరుతో రూ.6500 కోట్ల అవినీతి'

ఇళ్ల పట్టాల పేరుతో వైకాపా ప్రభుత్వం.. రూ. 6 వేల 500 కోట్ల అవినీతికి పాల్పడిందని.. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఇళ్ల స్థలాల్లో అక్రమాలు జరిగాయంటూ.. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్​లో.. తెలుగుదేశం నేతలు ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • శ్రీవారి భక్తులపై లాఠీఛార్జి జరగలేదు: వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో శ్రీవారిమెట్టు వద్ద భక్తులపై లాఠీఛార్జి జరిగిందంటూ వస్తున్న వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఇదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నేతల గృహ నిర్బంధాలపై చంద్రబాబు ఆగ్రహం

తెదేపా నేతల అరెస్టులు, గృహ నిర్బంధంపై చంద్రబాబు మండిపడ్డారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న వైకాపా నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కని, పౌరుల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'కరోనా స్ట్రెయిన్‌ విషయంలో అప్రమత్తంగా ఉన్నాం'

కరోనా స్ట్రెయిన్‌ విషయంలో అప్రమత్తంగా ఉన్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే పరీక్షలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రైతుల ఉద్యమానికి మద్దతుగా హజారే ఆందోళన

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపడుతున్న రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టనున్నట్టు సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రకటించారు. త్వరలోనే దిల్లీలోని రామ్​లీలా మైదానంలో రైతు దీక్షల్లో పాల్గొంటానని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మోదీ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడ్డారు'

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చట్టబద్దంగానే నిరసనలు తెలుపుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి చట్టాలని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆ దేశ ప్రధానిపై రూ.900కోట్ల దావా

ఇటలీ ప్రధానిపై ఆ దేశంలోని కొవిడ్-19తో మృతి చెందిన వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన నష్టానికి రూ.900 కోట్ల పరిహారం చెల్లించాలని అంటున్నారు. వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఇటలీ విఫలమైన నేపథ్యంలో బెర్గామో ప్రజలు న్యాయపోరాటం చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆర్బిట్రేషన్​ తీర్పుపై భారత్​ సవాల్​

భారత్​కు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రెట్రోస్పెక్టివ్ కేసులో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్​కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. సంస్థ నుంచి బాకీల వసూలు నిలిపివేయాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును తాజాగా భారత ప్రభుత్వం సవాల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ​ పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • లీగ్​లో ఆడుతున్న క్రికెటర్లకు హెయిర్​ కట్ కష్టమే!

కరోనా కట్టడిలో భాగంగా బిగ్​బాష్​ లీగ్​లో నిబంధనలను కఠినతరం చేశారు. హెయిర్​ కట్​ లాంటి వ్యక్తిగత అవసరాల కోసం ఆటగాళ్లెవరూ బయోబబుల్​ను దాటి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అరకు ఆదివాసీల పాటను ఆస్వాదించిన పవన్

వకీల్‌సాబ్‌ షూటింగ్‌ విరామంలో అరకు ఆదివాసీలు పాడిన పాటను ఆస్వాదించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ పాట వింటుంటే బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ రచించిన వనవాసి గుర్తుకు వస్తోందని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఇళ్ల పట్టాల పేరుతో రూ.6500 కోట్ల అవినీతి'

ఇళ్ల పట్టాల పేరుతో వైకాపా ప్రభుత్వం.. రూ. 6 వేల 500 కోట్ల అవినీతికి పాల్పడిందని.. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఇళ్ల స్థలాల్లో అక్రమాలు జరిగాయంటూ.. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్​లో.. తెలుగుదేశం నేతలు ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • శ్రీవారి భక్తులపై లాఠీఛార్జి జరగలేదు: వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో శ్రీవారిమెట్టు వద్ద భక్తులపై లాఠీఛార్జి జరిగిందంటూ వస్తున్న వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఇదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నేతల గృహ నిర్బంధాలపై చంద్రబాబు ఆగ్రహం

తెదేపా నేతల అరెస్టులు, గృహ నిర్బంధంపై చంద్రబాబు మండిపడ్డారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న వైకాపా నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కని, పౌరుల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'కరోనా స్ట్రెయిన్‌ విషయంలో అప్రమత్తంగా ఉన్నాం'

కరోనా స్ట్రెయిన్‌ విషయంలో అప్రమత్తంగా ఉన్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే పరీక్షలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రైతుల ఉద్యమానికి మద్దతుగా హజారే ఆందోళన

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపడుతున్న రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టనున్నట్టు సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రకటించారు. త్వరలోనే దిల్లీలోని రామ్​లీలా మైదానంలో రైతు దీక్షల్లో పాల్గొంటానని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మోదీ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడ్డారు'

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చట్టబద్దంగానే నిరసనలు తెలుపుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి చట్టాలని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆ దేశ ప్రధానిపై రూ.900కోట్ల దావా

ఇటలీ ప్రధానిపై ఆ దేశంలోని కొవిడ్-19తో మృతి చెందిన వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన నష్టానికి రూ.900 కోట్ల పరిహారం చెల్లించాలని అంటున్నారు. వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఇటలీ విఫలమైన నేపథ్యంలో బెర్గామో ప్రజలు న్యాయపోరాటం చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆర్బిట్రేషన్​ తీర్పుపై భారత్​ సవాల్​

భారత్​కు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రెట్రోస్పెక్టివ్ కేసులో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్​కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. సంస్థ నుంచి బాకీల వసూలు నిలిపివేయాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును తాజాగా భారత ప్రభుత్వం సవాల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ​ పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • లీగ్​లో ఆడుతున్న క్రికెటర్లకు హెయిర్​ కట్ కష్టమే!

కరోనా కట్టడిలో భాగంగా బిగ్​బాష్​ లీగ్​లో నిబంధనలను కఠినతరం చేశారు. హెయిర్​ కట్​ లాంటి వ్యక్తిగత అవసరాల కోసం ఆటగాళ్లెవరూ బయోబబుల్​ను దాటి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అరకు ఆదివాసీల పాటను ఆస్వాదించిన పవన్

వకీల్‌సాబ్‌ షూటింగ్‌ విరామంలో అరకు ఆదివాసీలు పాడిన పాటను ఆస్వాదించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ పాట వింటుంటే బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ రచించిన వనవాసి గుర్తుకు వస్తోందని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.