ETV Bharat / city

Mysterious Deaths : జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలు..కల్తీ సారే కారణమంటున్న బాధిత కుటుంబాలు

author img

By

Published : Mar 11, 2022, 9:59 AM IST

Updated : Mar 11, 2022, 12:31 PM IST

Kalthisara deaths : జంగారెడ్డిగూడెంలో రెండు రోజుల వ్యవధిలో 15 మంది మరణించారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆస్పత్రుల్లో చేరిన వారంతా తీవ్ర అవస్థతతో కన్నుమూశారు. కల్తీ సారే మరణాలకు కారణమని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో నాటుసారా ఏరులైపారుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Mysterious deaths
Mysterious deaths
జంగారెడ్డిగూడెంలో మిస్టరీ.. రెండు రోజుల్లో 15మంది మృతి..

Kalthisara deaths in West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. అప్పటి వరకు ఆరోగ్యం ఉన్నవారు ఒక్కసారిగా కడుపునొప్పితో కుప్పకూలిపోయారు. మరికొందరు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరారు. అంతే గంటల వ్యవధిలోనే 15 మంది చనిపోయారు. ముఖ్యంగా బుట్టాయగూడెం రోడ్డులోని గాంధీబొమ్మ సెంటర్‌ వీధిలోనే 10 మంది వరకు కన్నుమూయడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.

ఎన్నో ఏళ్లుగా మద్యం తాగే అలవాటు ఉన్నా.. ఎప్పుడూ కనీసం అస్వస్థతకు గురికాలేదని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సారా కల్తీ కావడం వల్లే చనిపోయారని తెలిపారు. ప్రభుత్వం కల్తీసారా తయారీదారులపై చర్యలు తీసుకోవడమే గాక.. తమ కుటుంబాలను ఆదుకోవాలని వేడుకున్నారు. చనిపోయినవారిలో ఒకరిద్దరు 60 ఏళ్లకు పైబడిన వారు కాగా మిగిలిన వారంతా 45 నుంచి 50 ఏళ్లలోపు వారేనని వాపోయారు.

రెండు రోజల వ్యవధిలోనే 15మంది చనిపోవడంతో ఆబ్కారీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దాడులు నిర్వహించి. బెల్లం ఊట, సారా తయారీ సామాగ్రి ధ్వంసం చేశారు.

ఇదీ చదవండి :

మచిలీపట్నంలో దారుణం.. ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై అత్యాచారం

జంగారెడ్డిగూడెంలో మిస్టరీ.. రెండు రోజుల్లో 15మంది మృతి..

Kalthisara deaths in West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. అప్పటి వరకు ఆరోగ్యం ఉన్నవారు ఒక్కసారిగా కడుపునొప్పితో కుప్పకూలిపోయారు. మరికొందరు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరారు. అంతే గంటల వ్యవధిలోనే 15 మంది చనిపోయారు. ముఖ్యంగా బుట్టాయగూడెం రోడ్డులోని గాంధీబొమ్మ సెంటర్‌ వీధిలోనే 10 మంది వరకు కన్నుమూయడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.

ఎన్నో ఏళ్లుగా మద్యం తాగే అలవాటు ఉన్నా.. ఎప్పుడూ కనీసం అస్వస్థతకు గురికాలేదని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సారా కల్తీ కావడం వల్లే చనిపోయారని తెలిపారు. ప్రభుత్వం కల్తీసారా తయారీదారులపై చర్యలు తీసుకోవడమే గాక.. తమ కుటుంబాలను ఆదుకోవాలని వేడుకున్నారు. చనిపోయినవారిలో ఒకరిద్దరు 60 ఏళ్లకు పైబడిన వారు కాగా మిగిలిన వారంతా 45 నుంచి 50 ఏళ్లలోపు వారేనని వాపోయారు.

రెండు రోజల వ్యవధిలోనే 15మంది చనిపోవడంతో ఆబ్కారీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దాడులు నిర్వహించి. బెల్లం ఊట, సారా తయారీ సామాగ్రి ధ్వంసం చేశారు.

ఇదీ చదవండి :

మచిలీపట్నంలో దారుణం.. ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై అత్యాచారం

Last Updated : Mar 11, 2022, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.