ETV Bharat / city

'పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి'

author img

By

Published : Apr 21, 2020, 5:26 PM IST

తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఏలూరులో రైతులు నిరసన తెలిపారు. లాక్​డౌన్​ కారణంగా పండించిన పంటలను అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

farmers protest in eluru for msp
farmers protest in eluru for msp

లాక్​డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రుణాలను మాఫీ చేయాలని, పరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు నిరసన తెలిపారు. ధాన్యం కల్లాల వద్ద ప్లకార్డులను పట్టుకుని ఆందోళన నిర్వహించారు. కరోనా విపత్తు వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అరకొర చర్యల వలన రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. లాక్​డౌన్​ వల్ల పండించిన పంటలను అమ్ముకోలేకపోతున్నామని... తమ సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

లాక్​డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రుణాలను మాఫీ చేయాలని, పరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు నిరసన తెలిపారు. ధాన్యం కల్లాల వద్ద ప్లకార్డులను పట్టుకుని ఆందోళన నిర్వహించారు. కరోనా విపత్తు వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అరకొర చర్యల వలన రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. లాక్​డౌన్​ వల్ల పండించిన పంటలను అమ్ముకోలేకపోతున్నామని... తమ సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

ఏపీ మత్స్యకారులను జాగ్రత్తగా చూసుకుంటాం: గుజరాత్​ సీఎంవో​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.