ETV Bharat / city

తలారిచెరువులోొ హత్యకుట్ర భగ్నం

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామ సమీపంలో హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కొండచరియల్లో వేట కొడవళ్లతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Mar 14, 2019, 1:33 PM IST

Updated : Mar 14, 2019, 2:11 PM IST

హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు
హత్యకుట్రను భగ్నం చేసిన పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామ సమీపంలో హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. వేట కొడవళ్లతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

గత ఏడాది సెప్టెంబర్​లో ఉరురుచింతలలో మల్లెల వెంకటరమణ, తలారి నాగ రంగయ్య దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో ఆమె బంధువులు వెంకటరమణను హత్య చేశారు. అడ్డు వచ్చిన నాగ రంగయ్యనూ మట్టుబెట్టారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు 12 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

ఈ హత్యలతో వెంకటరమణ, నాగ రంగయ్య బంధువులంతా ఒక్కటిగా చేరి పగతీర్చుకోవటానికి పథకం వేశారు. యల్లనూరు మండలం నిరజాంపల్లికి చెందిన వ్యక్తితో 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ వారి హత్యకు ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు.. తలారి చెరువుకి వస్తున్నారని తెలుసుకొని అక్కడే వేటకొడవళ్లతో కాపు కాశారు. ఈ విషయంపైగ్రామీణ సీఐ నారాయణ రెడ్డికి సమాచారం రావడంతో ఎస్సై రాజశేఖర్ రెడ్డి, సిబ్బందితో కలిసి కొండ వద్దకు చేరుకున్నారు. ఐదుగురిని, వారి వద్ద ఉన్న వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్​కుతరలించారు. హత్య కుట్రను భగ్నం చేసిన సిబ్బందిని డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి అభినందించారు.

హత్యకుట్రను భగ్నం చేసిన పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామ సమీపంలో హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. వేట కొడవళ్లతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

గత ఏడాది సెప్టెంబర్​లో ఉరురుచింతలలో మల్లెల వెంకటరమణ, తలారి నాగ రంగయ్య దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో ఆమె బంధువులు వెంకటరమణను హత్య చేశారు. అడ్డు వచ్చిన నాగ రంగయ్యనూ మట్టుబెట్టారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు 12 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

ఈ హత్యలతో వెంకటరమణ, నాగ రంగయ్య బంధువులంతా ఒక్కటిగా చేరి పగతీర్చుకోవటానికి పథకం వేశారు. యల్లనూరు మండలం నిరజాంపల్లికి చెందిన వ్యక్తితో 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ వారి హత్యకు ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు.. తలారి చెరువుకి వస్తున్నారని తెలుసుకొని అక్కడే వేటకొడవళ్లతో కాపు కాశారు. ఈ విషయంపైగ్రామీణ సీఐ నారాయణ రెడ్డికి సమాచారం రావడంతో ఎస్సై రాజశేఖర్ రెడ్డి, సిబ్బందితో కలిసి కొండ వద్దకు చేరుకున్నారు. ఐదుగురిని, వారి వద్ద ఉన్న వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్​కుతరలించారు. హత్య కుట్రను భగ్నం చేసిన సిబ్బందిని డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి అభినందించారు.


Satna (MP), Mar 13 (ANI): The dead body of a five-year-old boy, who was kidnapped, was found in a pond near his house in Satna district of Madhya Pradesh on Wednesday. Soon after he (Shiv) was kidnapped, his father Jhabbu Kumar received a call for a ransom of Rs. 2 lakh. According to Deputy Inspector General (DIG) Rewa, Avinash Sharma, "A constant investigation was on and help from cyber experts were also taken. We have also arrested the suspects in the case and interrogation is going on. Today morning, the boy's body was found inside a sack in the pond. Further investigation is on."

Last Updated : Mar 14, 2019, 2:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.